Mahmood Ali : పలువురు చనిపోయినట్టు అనుమానం.. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లోని రామ్గోపాల్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో.. మంటలను గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో ఉన్న పలువురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అయితే.. మరో ఇద్దరు గురించి ఆచూకీ తెలియరాలేదు. సంఘటన స్థలాన్ని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 11 గంటలకు ప్రమాదం జరిగిందని, డెక్కన్ స్పోర్ట్స్ నైట్ వేర్ లో ప్రమాదం జరిగిందన్నారు. అందులో మొత్తం ప్లాస్టిక్ ఉందని, మంటలను అదుపు చేసేందుకు 6 గంటలుగా సిబ్బంది శ్రమిస్తున్నారన్నారు. పలువురు చనిపోయినట్టు అనుమానం ఉందని, ఇంకా పూర్తిగా క్లారిటీ లేదని ఆయన వెల్లడించారు.
Also Read : Shubman Gill: స్టేడియంలో ‘సారా సారా’ స్లోగన్స్..గిల్ రియాక్షన్ ఇదిగో
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
అయితే.. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతామని, నిభందనలు ఉల్లంఘించి గోదాంలు నడిపితే కటిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా.. ఏ క్షణంలోనూ భవనానికి ముప్పు పొంచి ఉందని, భవనంలోని మూడు నాలుగు అంతస్తుల స్లాబ్లు కూలిపోయాయన్నారు. భవనం లోపల ఉన్న మెట్ల మార్గం కూడా కూలిపోయిందని, భవనం వెనుక వైపు గల మరొక భవనం స్లాబ్ సైత కూలిందని ఆయన తెలిపారు. సెల్లారు గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా మంటలు ఎగసిపడుతున్నాయని, సెల్లార్లో ఉన్న స్పోర్ట్స్ టీ షర్ట్ సింథటిక్ క్లాత్ కారణంగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కార్ యాక్సెసరీస్ ఫైబర్ పరికరాలలో భారీ మంటలు చెలరేగాయని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పరిసరాల భవనాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా భవనం కూలితే తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Also Read : Cm Jagan Mohan Reddy: ఉన్నత విద్యాశాఖపై సమీక్ష.. . ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్ పై జగన్ ఫోకస్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!