Mahmood Ali : పలువురు చనిపోయినట్టు అనుమానం.. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లోని రామ్గోపాల్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో.. మంటలను గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో ఉన్న పలువురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అయితే.. మరో ఇద్దరు గురించి ఆచూకీ తెలియరాలేదు. సంఘటన స్థలాన్ని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 11 గంటలకు ప్రమాదం జరిగిందని, డెక్కన్ స్పోర్ట్స్ నైట్ వేర్ లో ప్రమాదం జరిగిందన్నారు. అందులో మొత్తం ప్లాస్టిక్ ఉందని, మంటలను అదుపు చేసేందుకు 6 గంటలుగా సిబ్బంది శ్రమిస్తున్నారన్నారు. పలువురు చనిపోయినట్టు అనుమానం ఉందని, ఇంకా పూర్తిగా క్లారిటీ లేదని ఆయన వెల్లడించారు.
Also Read : Shubman Gill: స్టేడియంలో ‘సారా సారా’ స్లోగన్స్..గిల్ రియాక్షన్ ఇదిగో
Also Read
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
అయితే.. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతామని, నిభందనలు ఉల్లంఘించి గోదాంలు నడిపితే కటిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా.. ఏ క్షణంలోనూ భవనానికి ముప్పు పొంచి ఉందని, భవనంలోని మూడు నాలుగు అంతస్తుల స్లాబ్లు కూలిపోయాయన్నారు. భవనం లోపల ఉన్న మెట్ల మార్గం కూడా కూలిపోయిందని, భవనం వెనుక వైపు గల మరొక భవనం స్లాబ్ సైత కూలిందని ఆయన తెలిపారు. సెల్లారు గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా మంటలు ఎగసిపడుతున్నాయని, సెల్లార్లో ఉన్న స్పోర్ట్స్ టీ షర్ట్ సింథటిక్ క్లాత్ కారణంగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కార్ యాక్సెసరీస్ ఫైబర్ పరికరాలలో భారీ మంటలు చెలరేగాయని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పరిసరాల భవనాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా భవనం కూలితే తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Also Read : Cm Jagan Mohan Reddy: ఉన్నత విద్యాశాఖపై సమీక్ష.. . ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్ పై జగన్ ఫోకస్
తాజావార్తలు
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
-
DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!