MS Dhoni: అత్త చేతిలో ఎంఎస్ ధోని వ్యాపారం..! వందల కోట్ల విలువైన సంస్థకు ఆమె సీఈవో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి తెలియనివారుండరు.. భారత జట్టును విజయపథంలో నడిపి.. క్లిష్ట సమయంలోనూ జట్టుకు విజయాలను అందించి మిస్టర్ కూల్గా పేరు తెచ్చుకున్నారు.. అన్ని ఫార్మాట్లకు గుడ్బై చెప్పినా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇంకా సత్తా చాటుతూనే ఉన్నారు.. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్కింగ్స్ను ఐదోసారి చాంపియన్గా నిలిపి.. అసలు ధోనీ లేకుండా ఐపీఎల్ లేదా? అనేలా అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఓవైపు క్రికెట్ మరోవైపు వ్యాపారం.. కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్.. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్నారు జార్ఖండ్ డైనమైట్.. అయితే, మన మహేంద్రుడి వ్యాపార సామ్రాజ్యం మొత్తం తనకు పిల్లను ఇచ్చిన అత్త చేతిలో పెట్టారట ధోనీ..
విషయం ఏంటంటే.. ఓవైపు సంపాదిస్తూనే మరోవైపు.. పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టారు ధోనీ.. వినోద రంగంలోనూ ఎంట్రీ ఇచ్చారు.. ధోనీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పేరిట ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేశాడు. అయితే, ఆ సంస్థ బాధ్యతలు మొత్తం తనకు పిల్లనిచ్చిన అత్త చేతిలో పెట్టారు.. ఆ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మిస్టర్ కూల్ యొక్క అత్త షీలా సింగ్ అట! ఓ నివేదిక ప్రకారం.. తన ప్రొడక్షన్ హౌజ్లో కుటుంబ సభ్యులకు పెద్దపీట వేయాలని భావించిన ధోనీ.. భార్య సాక్షి సింగ్, ఆమె తల్లి షీలా సింగ్కు బాధ్యతలు అప్పగించాడు. కాగా, సౌత్లో తన బ్యానర్పై పలు చిత్రాలను నిర్మిస్తున్న ధోనీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ విలువ దాదాపు 800 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కంపెనీలో సాక్షి అతిపెద్ద షేర్ హోల్డర్ అని సమాచారం.
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
అయితే, సాక్షి తండ్రి ఆర్కే సింగ్, ధోనీ తండ్రి పాన్ సింగ్ గతంలో ఒకే స్థలంలో కలిసి పనిచేశారు. బినాగురి అనే టీ కంపెనీలో వీరు సహచరులుగా ఉన్నట్లు తెలుస్తోంది.. అప్పట్లో గృహిణిగా ఉన్న షీలా సింగ్.. అల్లుడు ధోనీ కోరిక మేరకు కూతురితో కలిసి వ్యాపారవేత్తగా మారినట్లు ఆ నివేదిక చెబుతోంది.. ఇక, చాలా నివేదికల్లో మిస్టర్ కూల్ ధోని నికర ఆస్తుల విలువ దాదాపు 1030 కోట్లుగా అంచనా వేస్తున్నారు.. కాగా, ఐపీఎల్లో సీఎస్కే కెప్టెన్గా ఉన్న ధోనీ ఇప్పటి వరకు ఐదుసార్లు ట్రోఫీని జట్టుకు అందించాడు. టీమిండియా బెస్ట్ ఫినిషర్గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ.. తన కెరీర్లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 4,876 పరుగులు, వన్డేల్లో 10,773 పరుగులు, టీ20ల్లో 1,617 పరుగులు చేశాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మిస్టర్ కూల్.. ఐపీఎల్లో మాత్రం కొనసాగుతూ వస్తున్న విషయం విదితమే. పెళ్లి అయిన తర్వాత ఏ భర్త అయినా.. భార్య మాట వింటాడని.. ఆమె చెప్పినట్టే నడుచుకుంటారని అంటారు.. అత్తలు కూడా కూతురు, అల్లుడిపై ఎక్కువ మమకారం చూపుతారని చెబుతుంటారు.. మన ధోనీ మాత్రం.. ఏకంగా వందల కోట్ల విలువైన సంస్థను అత్తగారి చేతిలో పెట్టేశాడు మరి.
తాజావార్తలు
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!