INDvsAUS Test: బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఆ జట్టుదే.. మాజీ క్రికెటర్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9న నుంచి ప్రారంభకానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సిరీస్ కోసం అటు ఆటగాళ్లతో పాటు అభిమానులూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్లు జోరందుకున్నాయి. పలువురు మాజీలు ఇదే విషయమై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆస్ట్రేలియాకు ఓటు వేస్తుంటే మరికొందరు మాత్రం ఇండియా టీమ్ వైపు నిల్చుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే ఈ సిరీస్ విజేత ఎవరనే దానిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం టీమ్ పరంగా ఆసీస్ బలంగా ఉందని.. ఆ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువని తెలిపాడు.
Also Read: Anand Mahindra: సానియా మీర్జా నాకు స్ఫూర్తి: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
Also Read
- Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
- WI vs PAK: వెస్టిండీస్ ఘన విజయం.. WTC పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్.!
- Anantapur GGH: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి పసికందును పడేసిన నానమ్మ.. శిశువు కాపాడిన వాటర్ బాటిల్!
- 200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
“ఆసీస్-భారత్ మధ్య బోర్డర్- గవస్కర్ ట్రోఫీ ఎప్పటికీ చారిత్రాత్మకంగానే ఉంటుంది. భారత పరిస్థితులను ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్కు మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. అయితే, తొలి టెస్టులో ఎవరు విజయం సాధిస్తారో వారికి ఒక మంచి ప్రారంభం దొరికినట్లవుతుంది. కానీ, ఎవరు విజేతగా నిలుస్తారనేది మాత్రం అంచనా వేయడం కష్టం. ఈ సిరీస్లో భారత్పై ఆస్ట్రేలియా అన్ని విధాలుగా పైచేయి సాధిస్తుందని భావిస్తున్నా. 2-1 తేడాతో సిరీస్ను ఆసీస్ కైవసం చేసుకుంటుంది. కానీ, ఆస్ట్రేలియాకు భారత్ గట్టి పోటీని ఇస్తుంది” అని జయవర్దనే పేర్కొన్నాడు.
Also Read: RC 15: హీరోయిన్ పెళ్లి కారణంగా షూటింగ్ క్యాన్సిల్…
తొలిసారి 1996-97లో జరిగిన బోర్డర్-గవస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. అలాగే 2016-17, 2018 -2019, 2020 – 2021 సీజన్లలోనూ భారత జట్టే ట్రోఫీని గెలుచుకుంది. ఈసారి ట్రోఫీని కూడా సొంతం చేసుకుంటే.. నాలుగు టెస్టుల సిరీస్ను వరుసగా నాలుగో సారి కూడా సొంతం చేసుకొన్న జట్టుగా భారత్ అవతరిస్తుంది.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
-
Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
WI vs PAK: వెస్టిండీస్ ఘన విజయం.. WTC పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్.!
-
Michael Biopic OTT: రూ.10 వేల కోట్ల సంచలనం.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలోకి ‘మైఖేల్’ బయోపిక్!
ట్రెండింగ్
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!