INDvsAUS Test: బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఆ జట్టుదే.. మాజీ క్రికెటర్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9న నుంచి ప్రారంభకానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సిరీస్ కోసం అటు ఆటగాళ్లతో పాటు అభిమానులూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్లు జోరందుకున్నాయి. పలువురు మాజీలు ఇదే విషయమై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆస్ట్రేలియాకు ఓటు వేస్తుంటే మరికొందరు మాత్రం ఇండియా టీమ్ వైపు నిల్చుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే ఈ సిరీస్ విజేత ఎవరనే దానిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం టీమ్ పరంగా ఆసీస్ బలంగా ఉందని.. ఆ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువని తెలిపాడు.
Also Read: Anand Mahindra: సానియా మీర్జా నాకు స్ఫూర్తి: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
Also Read
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
“ఆసీస్-భారత్ మధ్య బోర్డర్- గవస్కర్ ట్రోఫీ ఎప్పటికీ చారిత్రాత్మకంగానే ఉంటుంది. భారత పరిస్థితులను ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్కు మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. అయితే, తొలి టెస్టులో ఎవరు విజయం సాధిస్తారో వారికి ఒక మంచి ప్రారంభం దొరికినట్లవుతుంది. కానీ, ఎవరు విజేతగా నిలుస్తారనేది మాత్రం అంచనా వేయడం కష్టం. ఈ సిరీస్లో భారత్పై ఆస్ట్రేలియా అన్ని విధాలుగా పైచేయి సాధిస్తుందని భావిస్తున్నా. 2-1 తేడాతో సిరీస్ను ఆసీస్ కైవసం చేసుకుంటుంది. కానీ, ఆస్ట్రేలియాకు భారత్ గట్టి పోటీని ఇస్తుంది” అని జయవర్దనే పేర్కొన్నాడు.
Also Read: RC 15: హీరోయిన్ పెళ్లి కారణంగా షూటింగ్ క్యాన్సిల్…
తొలిసారి 1996-97లో జరిగిన బోర్డర్-గవస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. అలాగే 2016-17, 2018 -2019, 2020 – 2021 సీజన్లలోనూ భారత జట్టే ట్రోఫీని గెలుచుకుంది. ఈసారి ట్రోఫీని కూడా సొంతం చేసుకుంటే.. నాలుగు టెస్టుల సిరీస్ను వరుసగా నాలుగో సారి కూడా సొంతం చేసుకొన్న జట్టుగా భారత్ అవతరిస్తుంది.
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!