INDvsAUS Test: బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఆ జట్టుదే.. మాజీ క్రికెటర్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9న నుంచి ప్రారంభకానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సిరీస్ కోసం అటు ఆటగాళ్లతో పాటు అభిమానులూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్లు జోరందుకున్నాయి. పలువురు మాజీలు ఇదే విషయమై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆస్ట్రేలియాకు ఓటు వేస్తుంటే మరికొందరు మాత్రం ఇండియా టీమ్ వైపు నిల్చుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే ఈ సిరీస్ విజేత ఎవరనే దానిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం టీమ్ పరంగా ఆసీస్ బలంగా ఉందని.. ఆ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువని తెలిపాడు.
Also Read: Anand Mahindra: సానియా మీర్జా నాకు స్ఫూర్తి: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
“ఆసీస్-భారత్ మధ్య బోర్డర్- గవస్కర్ ట్రోఫీ ఎప్పటికీ చారిత్రాత్మకంగానే ఉంటుంది. భారత పరిస్థితులను ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్కు మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. అయితే, తొలి టెస్టులో ఎవరు విజయం సాధిస్తారో వారికి ఒక మంచి ప్రారంభం దొరికినట్లవుతుంది. కానీ, ఎవరు విజేతగా నిలుస్తారనేది మాత్రం అంచనా వేయడం కష్టం. ఈ సిరీస్లో భారత్పై ఆస్ట్రేలియా అన్ని విధాలుగా పైచేయి సాధిస్తుందని భావిస్తున్నా. 2-1 తేడాతో సిరీస్ను ఆసీస్ కైవసం చేసుకుంటుంది. కానీ, ఆస్ట్రేలియాకు భారత్ గట్టి పోటీని ఇస్తుంది” అని జయవర్దనే పేర్కొన్నాడు.
Also Read: RC 15: హీరోయిన్ పెళ్లి కారణంగా షూటింగ్ క్యాన్సిల్…
తొలిసారి 1996-97లో జరిగిన బోర్డర్-గవస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. అలాగే 2016-17, 2018 -2019, 2020 – 2021 సీజన్లలోనూ భారత జట్టే ట్రోఫీని గెలుచుకుంది. ఈసారి ట్రోఫీని కూడా సొంతం చేసుకుంటే.. నాలుగు టెస్టుల సిరీస్ను వరుసగా నాలుగో సారి కూడా సొంతం చేసుకొన్న జట్టుగా భారత్ అవతరిస్తుంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!