Farmer Suicide: “నా పిల్లల చదువు బాధ్యత సీఎం తీసుకోవాలి..” లేఖ రాసి రైతు ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmer Suicide: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా బార్షి తాలూకాలోని దహితానే (వైరాగ్) గ్రామంలో ఒక విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, అధిక వర్షపాతం, పెరుగుతున్న విద్యా ఖర్చులతో బాధపడుతూ ఒక రైతు మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు 40 ఏళ్ల లక్ష్మణ్ కాశీనాథ్ గవాసానేగా గుర్తించారు.
READ MORE: R.S. Brothers : 15వ షోరూమ్ హైదరాబాద్ వనస్థలిపురంలో శుభారంభం
Also Read
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
బుధవారం ఉదయం 7:30 గంటలకు ససురా శివార్లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం లక్ష్మణ్ ఇంటి నుంచి వైరాయ్ మార్కెట్కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. కానీ తిరిగి రాలేదు. ఆ రాత్రి రోజు రాత్రి వైరాగ్ పోలీస్ స్టేషన్లో అతని కుటుంబం ఆయన తప్పిపోయినట్లు ఫిర్యాదు అందించింది. బుధవారం ఉదయం.. గ్రామ సమీపంలోని మామిడి చెట్టుకు వేలాడుతూ మృతదేహం కనిపించింది. పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ ప్రతాప్సింగ్ జాదవ్, సబ్-ఇన్స్పెక్టర్ శివాజీ హేల్, కానిస్టేబుల్ ప్రదీప్ చవాన్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.
READ MORE: KTR : 400 కి.మీ మెట్రో విస్తరణకు మేము పచ్చ జెండా ఊపాము.. హైదరాబాద్ ట్రాఫిక్కు శాశ్వత పరిష్కారం!
అయితే.. మృతుడి జేబులో ఒక లేఖ దొరికింది. “ఎమ్మెల్యేలు, ఎంపీలు దయచేసి ఆర్థిక సహాయం అందించండి. నా పిల్లలు జ్ఞానేశ్వర్, జ్ఞానేశ్వరిల విద్యకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి.” అని రాశారు. ఈ లేఖ కుటుంబ సభ్యులను, గ్రామస్తులను కదిలించింది. అయితే.. లక్ష్మణ్ గవాసానే కుమార్తె బి.ఎస్సీ డిగ్రీ చదువుతోంది. కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇద్దరికీ విద్యా ఖర్చులు క్రమంగా పెరుగడం కూడా ఆయన ఆత్మహత్యకు ఓ కారణం అని చెబుతున్నారు. మరోవైపు, ఆ రైతుకు ఒకటిన్నర ఎకరాల భూమి ఉంది. గత వారం రోజులుగా నిరంతరాయంగా కురిసిన వర్షాలకు పంట పొలంలోకి భారీగా నీరు చేరాయి. పంట కుళ్ళిపోయింది. ఫలితంగా గణనీయమైన నష్టాలు సంభవించాయి. పంట వైఫల్యం, అనారోగ్యం, పెరుగుతున్న ఖర్చులతో నిరాశ చెందిన లక్ష్మణ్ ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు.
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?