Farmer Suicide: “నా పిల్లల చదువు బాధ్యత సీఎం తీసుకోవాలి..” లేఖ రాసి రైతు ఆత్మహత్య..
Farmer Suicide: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా బార్షి తాలూకాలోని దహితానే (వైరాగ్) గ్రామంలో ఒక విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, అధిక వర్షపాతం, పెరుగుతున్న విద్యా ఖర్చులతో బాధపడుతూ ఒక రైతు మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు 40 ఏళ్ల లక్ష్మణ్ కాశీనాథ్ గవాసానేగా గుర్తించారు.
READ MORE: R.S. Brothers : 15వ షోరూమ్ హైదరాబాద్ వనస్థలిపురంలో శుభారంభం
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
బుధవారం ఉదయం 7:30 గంటలకు ససురా శివార్లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం లక్ష్మణ్ ఇంటి నుంచి వైరాయ్ మార్కెట్కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. కానీ తిరిగి రాలేదు. ఆ రాత్రి రోజు రాత్రి వైరాగ్ పోలీస్ స్టేషన్లో అతని కుటుంబం ఆయన తప్పిపోయినట్లు ఫిర్యాదు అందించింది. బుధవారం ఉదయం.. గ్రామ సమీపంలోని మామిడి చెట్టుకు వేలాడుతూ మృతదేహం కనిపించింది. పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ ప్రతాప్సింగ్ జాదవ్, సబ్-ఇన్స్పెక్టర్ శివాజీ హేల్, కానిస్టేబుల్ ప్రదీప్ చవాన్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.
READ MORE: KTR : 400 కి.మీ మెట్రో విస్తరణకు మేము పచ్చ జెండా ఊపాము.. హైదరాబాద్ ట్రాఫిక్కు శాశ్వత పరిష్కారం!
అయితే.. మృతుడి జేబులో ఒక లేఖ దొరికింది. “ఎమ్మెల్యేలు, ఎంపీలు దయచేసి ఆర్థిక సహాయం అందించండి. నా పిల్లలు జ్ఞానేశ్వర్, జ్ఞానేశ్వరిల విద్యకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి.” అని రాశారు. ఈ లేఖ కుటుంబ సభ్యులను, గ్రామస్తులను కదిలించింది. అయితే.. లక్ష్మణ్ గవాసానే కుమార్తె బి.ఎస్సీ డిగ్రీ చదువుతోంది. కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇద్దరికీ విద్యా ఖర్చులు క్రమంగా పెరుగడం కూడా ఆయన ఆత్మహత్యకు ఓ కారణం అని చెబుతున్నారు. మరోవైపు, ఆ రైతుకు ఒకటిన్నర ఎకరాల భూమి ఉంది. గత వారం రోజులుగా నిరంతరాయంగా కురిసిన వర్షాలకు పంట పొలంలోకి భారీగా నీరు చేరాయి. పంట కుళ్ళిపోయింది. ఫలితంగా గణనీయమైన నష్టాలు సంభవించాయి. పంట వైఫల్యం, అనారోగ్యం, పెరుగుతున్న ఖర్చులతో నిరాశ చెందిన లక్ష్మణ్ ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు.
తాజావార్తలు
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!