Durga Idol History: నవరాత్రి స్పెషల్: 258 ఏళ్లుగా నిమజ్జనం కానీ దుర్గామాత విగ్రహం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Durga Idol History: నవరాత్రి అంటే మొదట గుర్తుకు వచ్చేది దుర్గామాత. మీకు తెలుసు కదా.. అమ్మవారి విగ్రహాలను దుర్గాపూజ ముగియగానే నదీజలాల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ అని. కానీ దాదాపు 258 ఏళ్లుగా నిమజ్జనం చేయకుండా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గామాత ఎక్కడ ఉందో తెలుసా. ఇంతకీ ఈ పురాతన ఆలయం విశిష్టత, పురాణ కథ, ఎక్కడ ఉందో, ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: CM Chandrababu: గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సంచర్.. ఐటీ హబ్గా విశాఖ!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో అమ్మవారి దర్శనం..
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో చారిత్రక దుర్గబరి ఆలయంలో ఏర్పాటు చేసిన అరుదైన దుర్గాదేవి మట్టి విగ్రహం వెనుక ఒక విశేషమైన కథ ఉంది. ఈ విగ్రహాన్ని మొట్టమొదటగా క్రీ.శ. 1766లో ఏర్పాటు చేశారని ఇక్కడి వారు చెబుతున్నారు. నాటి నుంచి ప్రతి ఏడాది దేవీ నవరాత్రులు పూర్తయిన తర్వాత భక్తులు ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ప్రయత్నించారు. అయితే ప్రతీసారి ఏదో ఒక అవాంతరం జరగడం లేదా విగ్రహం నిమజ్జనం కాకుండా ఆగిపోతున్నట్టు స్థానికులు చెబుతారు.
పలు పురాణాల ప్రకారం.. సాక్షాత్తు దుర్గాదేవి ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదని ఆదేశించిందని భక్తులు విశ్వసిస్తారు. నిమజ్జనం చేసేందుకు ప్రయత్నించిన పూజారులకు, కలలో కనిపించి తాను ఎప్పటికీ ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తానని చెప్పిందట. అందుకే నాటి నుంచి ఈ విగ్రహాన్ని శాశ్వత విగ్రహంగా పరిగణించడం మొదలుపెట్టారు. చరిత్ర సంప్రదాయం మేళవించిన ఈ విగ్రహం కేవలం మట్టి ప్రతిమ మాత్రమే కాకుండా, అనేక తరాల భక్తికి విశ్వాసానికి చిహ్నంగా నిలుస్తుంది.
వారణాసిలోని దుర్గబరి ఆలయం కేవలం ఒక పురాతన దేవాలయం మాత్రమే కాదని, ఇది నిమజ్జనం కాని దుర్గామాత విగ్రహం ద్వారా అచంచలమైన విశ్వాసాన్ని శతాబ్దాల సంప్రదాయాన్ని తెలియజేస్తుందని భక్తులు చెబుతున్నారు. 1766 నుంచి నేటి వరకు తరతరాలుగా భక్తుల పూజలను అందుకుంటూ నిత్యం కరుణను పంచుతున్న ఈ మట్టి ప్రతిమ భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అద్భుత ఘట్టం అని అంటున్నారు.
మట్టితో తయారు చేసిన విగ్రహం..
ఈ విగ్రహాన్ని 258 ఏళ్లు క్రితం మట్టితో తయారు చేశారు. నాటి నుంచి దీనిని నిమజ్జనం చేయకుండా ఉండటం ఒక అద్భుతంగా భక్తులు భావిస్తున్నారు. ఆలయ అధికారులు, పూజారులు విగ్రహం శిథిలం కాకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రతి ఏడాది దుర్గాపూజ సమయంలో ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి నవరాత్రులు ముగిశాక నిమజ్జనం చేయాల్సిన భాగాలను (కొన్ని చిన్నపాటి ఆభరణాలు లేదా భాగాలను) మాత్రమే నిమజ్జనం చేస్తారని చెబుతున్నారు. ప్రధాన విగ్రహం మాత్రం ఆలయంలోనే శాశ్వతంగా ఉంటుంది. పలువురు స్థానికులు మాట్లాడుతూ.. ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారని, ఇది ఒక ముఖ్యమైన తీర్థయాత్రా స్థలంగా మారిందని చెబుతున్నారు.
READ ALSO: Bathukamma Festival: 9 రోజుల బతుకమ్మ పండుగ.. ఇక్కడ మాత్రం 7 రోజులే.. !
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!