Maha Shivratri 2025: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రముఖ శైవక్షేత్రాలు ఇవే!
- భారతదేశంలోని ముఖ్యమైన హిందూ పండుగల్లో మహా శివరాత్రి ఒకటి.
- రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రముఖ ప్రముఖ శైవక్షేత్రాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Shivratri 2025: మహా శివరాత్రి భారతదేశంలోని ముఖ్యమైన హిందూ పండుగల్లో ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మహా శివరాత్రిని ప్రత్యేక ఉత్సవాలతో, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి. వాటిని ఎలా చెరలో ఒకసారి చూద్దాం.
తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రాలు:
Also Read
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు రాజరాజేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం, ఇంద్రుడు బ్రహ్మహత్యా దోషాన్ని నివారించుకున్న పవిత్ర స్థలం ఇది. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
కొమురవెల్లి:
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయం కూడా శివ భక్తులకు ఎంతో ప్రాముఖ్యత కలిగినది. 500 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ శివుడు మల్లన్న రూపంలో కొలువుదీరాడు. సంక్రాంతి పర్వదిన సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు విశేషంగా ఉంటాయి. మహా శివరాత్రి రోజున ఇక్కడ జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు.
రామప్ప ఆలయం:
కాకతీయుల కాలంలో నిర్మించబడిన చారిత్రక దేవాలయం రామప్ప ఆలయం. ఇది హైదరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో వరంగల్ జిల్లాలో ఉంది. రామలింగేశ్వరుడి రూపంలో శివుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయం అద్భుతమైన శిల్ప సంపదకు ప్రసిద్ధి.
కాళేశ్వరం:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ గుడిలో.. ఎక్కడాలేని విధంగా ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉంటాయి. పురాణాల్లో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉండడం విశేషం. గుడిలోని కాళేశ్వరుడిని (యముడు) పూజించి, ఆ తర్వాత ముక్తేశ్వరుడిని (శివుడు) పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
వెయ్యి స్తంభాల గుడి:
వరంగల్ జిల్లా హనుమకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి కాకతీయుల కాలం నాటి గొప్ప నిర్మాణం. 12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయంలో శివుడు, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు కలిసి కొలువై ఉన్నారు.
వీటితోపాటు రాష్ట్రంలో కీసర, పానగల్, రాచకొండ, ఐనవోలు, చెరువుగట్టు ప్రాంతాలలో ప్రముఖ శైవక్షేత్రాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రాలు:
శ్రీశైలం:
నల్లమల కొండలపై వెలసిన శ్రీశైలం ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేరుగాంచింది. ఇక్కడ భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చు.
ద్రాక్షారామం:
తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం హిందూ పురాణాలలో గొప్ప స్థానం కలిగి ఉంది.
శ్రీకాళహస్తి:
తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి ఆలయం వాయు లింగంగా ప్రసిద్ధి చెందింది. భక్తులు ఇక్కడ ప్రార్థన చేస్తే శాంతి, ఆనందం పొందుతారని నమ్మకం.
మహానంది:
నల్లమల కొండలలో ఉన్న మహానంది ఆలయం ప్రాచీనమైనది. భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్న కోనేరులలో నీరు ఎంతో స్వచ్ఛగా ఎల్లకాలం ఉంటాయి.
అమరేశ్వర ఆలయం:
అమరావతిలోని అమరేశ్వర ఆలయం కృష్ణా నది ఒడ్డున ఉన్న పంచారామ క్షేత్రాలలో ఒకటి.
క్షీరారామ ఆలయం:
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్న క్షీరారామ ఆలయం, పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇది ఎత్తైన గోపురానికి ప్రసిద్ధి.
రామలింగేశ్వర ఆలయం:
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రామలింగేశ్వర ఆలయం శిల్పసంపదకు ప్రసిద్ధి.
సోమారామ ఆలయం:
భీమవరంలో ఉన్న సోమారామ ఆలయం, పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడి శివలింగం పౌర్ణమి సమయంలో రంగు మారుతుందని భక్తుల నమ్మకం.
యాగంటి:
నంద్యాల జిల్లాలోని యాగంటి ఆలయం పవిత్ర శైవక్షేత్రం. ఇక్కడ భారీ నంది విగ్రహం ప్రసిద్ధి. అలాగే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కాకులు ఎగరవు.
తాజావార్తలు
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!