AP High Court: సంక్షేమ పథకాల నిధులు విడుదల నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు.. లంచ్ మోషన్ పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సంక్షేమ పథకాల నిధులు విడుదల నిలిపివేయాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈసీ ఆదేశాలతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిలిచి పోయిందని పిటిషనర్ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీలో కరువు మండలాల్లో రైతుల ఇబ్బందులను గుర్తించటానికి 2023లోనే ప్రభుత్వం కలెక్టర్లతో కమిటీ వేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. 108 కరువు మండలాల్లో 6.95 లక్షల రైతులను గుర్తించి గత ఏడాది అక్టోబర్లో కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్టు పిటిషనర్ తెలిపారు. ఎన్నికల కోడ్ రాక ముందే లబ్ధిదారుల గుర్తింపు, జీఓ విడుదల చేసినట్టు పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల కోడ్కు 4 నెలల కింద ఈ ప్రోసెస్ జరిగిందని.. ఇప్పుడు కేవలం లబ్దిదారులకు సొమ్ము జమ చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఇది ఎన్నికల సమయంలో కొత్తగా తీసుకువచ్చిన పథకం కాదన్నారు పిటిషనర్. వరదలు, ఆన్ గోయింగ్ స్కీమ్స్, అత్యవసర పరిస్థితుల్లో సాయం అపాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ రూల్స్లో ఉందని పిటిషనర్ కోర్టుకు చెప్పారు.
RR vs DC: ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాలని లక్ష్యంగా బరిలోకి రాజస్థాన్ రాయల్స్..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
గత ఏడాదిలో నాలుగు దశల్లో జరిగిన ఈ ప్రక్రియకు చివరగా నగదు జమ చేస్తున్నారు తప్ప.. కొత్తగా కాదని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి రావటానికి ముందు 4 నెలల క్రితమే ఈ ప్రక్రియ చేపడితే ఎన్నికల సంఘం ఇప్పుడు ఇలా నిలిపి వేస్తూ ఆదేశాలు ఇస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది ఏ విధంగా ఎన్నికల నిబంధనలు అతిక్రమించినట్టు అని పిటిషనర్ తెలిపారు. కరువు మండలాల్లో రైతులకు మే, జూన్, జులై నెలలో సాయం చేస్తామని.. ఇపుడు అది అందకపోతే రైతులు ఇబ్బంది పడతారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఇన్ పుట్ సబ్సిడీ అనేది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ తప్ప కొత్తది కాదని పిటిషనర్ పేర్కొన్నారు. కరువు మండలాల గుర్తింపు, లబ్దిదారుల గుర్తింపు అంతా.. కోడ్ రాక ముందే చేశామని, ఇది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కిందే వస్తుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, అరియర్స్ ఇప్పుడు ప్రకటిస్తే.. అది ఇప్పుడు కొత్తగా ప్రకటించినట్టు అవుతుందన్నారు. ప్రతి నెలా ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కింద ఫించన్లు ఇస్తున్నారు కదా అని న్యాయస్థానం పేర్కొంది. ఇన్ పుట్ సబ్సిడీ నిధుల విడుదలపై ప్రభుత్వం వినతి పత్రం ఇస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఈసీ కోర్టుకి తెలిపింది. ప్రభుత్వం తరఫున స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే ఈసీనీ కలిసి విషయం తెలిపినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కొత్తగా నిధుల విడుదల చేయాలని.. డీటైల్డ్ వినతి పత్రం ఇవ్వాలని ఈలోపు ఈసీ నిర్ణయం తెలపాలని ఏపీ హైకోర్టు పేర్కొంది. కాగా.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!