Real Drushyam 2 : ఇది రియల్ దృశ్యం.. డ్యాములో మునిగిన కారు.. లేచిపోయిన బావామరదళ్ళ అస్థిపంజరాలు లభ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lovers’ Skeletons Found Inside A Floating Car In Kuwari River: మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్ హీరోలుగా నటించిన దృశ్యం 2 సినిమాలోని ఒక సీన్ రిపీట్ అయింది. ఈ సినిమాలో కారును ఒక నీటి సంపులో దాస్తాడు హీరో. చాలా కాలానికి ఆ కారు బయటపడుతుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో అలాంటిదే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. మొరెనా జిల్లాలో ఒక స్టాప్ డ్యామ్లో మునిగిన కారులో నుండి ఒక వివాహిత, ఆమె బావమరిది ఛిద్రమైన మృతదేహాలు(అస్థిపంజరాలు) వెలికితీయడం సంచలనం రేపింది.
Priyanka Chopra: మూతపడనున్న ప్రియాంక చోప్రా ‘సోనా’ రెస్టారెంట్.. ఎందుకో తెలుసా?
Also Read
- Amit Shah-Om Birla: లోక్సభ స్పీకర్కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
- Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మృతి.? పాక్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..
- NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్షీట్
- Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
స్టాప్ డ్యామ్ నీటి మట్టం తగ్గిన తర్వాత, ఒక గ్రామంలోని నివాసితులు అస్థిపంజరాలుగా మారిన వారి మృతదేహాలను కలిగి ఉన్న కారును చూశారు. సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు మిథిలేష్ జాదవ్ (30), ఆమె బావ నీరజ్ సఖ్వార్ (34)గా గుర్తించారు. మిథిలేష్ మరియు నీరజ్ ఒకరికి ఒకరు ప్రేమించుకుంటున్నారని, ఫిబ్రవరిలో వారి ఇంటి నుంచి పారిపోయారని చెబుతున్నారు. గోపి గ్రామంలోని క్వారీ నదిపై నిర్మించిన స్టాప్ డ్యామ్లో లభించిన కారులో ఇద్దరి అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నట్లు సిహోనియా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ధర్మేంద్ర గౌర్ తెలిపారు. వాస్తవానికి, ప్రతి సంవత్సరం స్టాప్ డ్యామ్ నుంచి నీటిని శుభ్రం చేయడానికి నీటిని విడుదల చేస్తారు. నీటిమట్టం తగ్గడంతో మంగళవారం మధ్యాహ్నం స్టాప్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయగా.. మధ్యలో ఓ కారు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని స్టాప్ డ్యామ్ మధ్యలో కారును చూసింది. బాగా కుళ్లిపోయిన మృతదేహాలు స్త్రీ, పురుషుడివని గుర్తించారు.
మృతుడు నీరజ్ సఖ్వార్కు మిథ్లేష్ మరదలు అని తేలింది. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, ఫిబ్రవరి 6న ఇంటి నుంచి పారిపోయారని వారి కుటుంబ సభ్యుల విచారణలో తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మిథిలేష్ భర్త ముఖేష్ సఖ్వార్ తన భార్య మార్కెట్కు వెళ్లిందని, ఆపై ఆమె బంధువు నీరజ్తో కలిసి అక్కడి నుంచి పారిపోయిందని ఫిర్యాదు చేశాడు. వారు తిరిగి వస్తారని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నందున ఫిబ్రవరి 14న రిపోర్ట్ చేశారు. ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, కారు స్టాప్ డ్యామ్లో ఎప్పుడు, ఎలా పడిపోయింది అనే సహా అన్ని కోణాల్లో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తారని తెలిపారు.
- Tags
తాజావార్తలు
-
Amit Shah-Om Birla: లోక్సభ స్పీకర్కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
-
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మృతి.? పాక్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..
-
Medigadda Case : మేడిగడ్డ కేసులో మరో ట్విస్ట్.. కేసీఆర్కు మళ్లీ సమన్లు..!
-
NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్షీట్
-
Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..