Lok Sabha Elections: నామినేషన్ వేసేందుకు కాళ్ల వేళ్ల పడ్డ అభ్యర్థి.. అనుమతించని అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పబ్లిక్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరు. కారణం ఏదైనా సమయానికి చేరుకోవాలని పబ్లిక్ పరీక్షల సమయంలో అధికారులు చెబుతూనే ఉంటారు. ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చిన విద్యార్థులు లోపలికి అనుమతించమని ఏడుస్తూ.. ఉపాధ్యాయులు, అధికారుల కాళ్లవేళ్ల పడటం మనం చూస్తుంటాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి సైతం పరీక్షకాలంగా మారింది. నామినేషన్ వేయడానికి చివరి రోజు నిమిషం ఆలస్యంగా వచ్చిన అతడిని ఎన్నికల అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో అధికారి కాళ్ల వేళ్ల పడ్డాడు.
READ MORE: Anupama: చెప్పినట్టుగానే ‘పరదా’ తొలగించుకు వస్తున్నా.. అనుపమ కీలక వ్యాఖ్యలు
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ఎస్సీ రిజర్వుడు అయిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో దళిత బహుజన పార్టీ అభ్యర్థిగా మాతంగి హనుమయ్య పోటీకి సిద్దమయ్యారు. అన్ని పత్రాలు సిద్దం చేసుకున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి రోజు పెద్దపల్లి కలెక్టర్ భవనంలోని ఆర్వో కార్యాలయానికి చేరారు. అప్పటికి సరిగ్గా సమయం మధ్యాహ్నం 3:01 అయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు తీసుకుంటారు. హనుమయ్య ప్రధాన గేటు దగ్గరకు వచ్చేసరికి మూడు గంటల ఒక్క నిమిషం అయ్యింది. అప్పటికే అక్కడ ఉన్న అధికారులు హనుమయ్య లోనికి అనుమతించలేదు. ప్లీజ్ సార్ లోపలికి అనుమతించడని అతడు వేడుకున్నారు. కాళ్ల వేళ్ల పడి బ్రతిమలాడినా అధికారులు ఒప్పుకోలేదు. దీంతో అతడు ఆవేదనతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉంది. కాబట్టే అధికారులను వేడుకున్నాడు. కాని ఎన్నికల సంఘం ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు వారం రోజుల సమయం ఇచ్చింది. పోటీ చేయాలనుకునే హనుమయ్య ఏదో ఒకరోజు నామినేషన్ వేయచ్చు కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానానికి 83 మంది అభ్యర్థులు 110 నామినేషన్ దాఖలు చేశారు. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, ఎస్.కుమార్ నామినేషన్ వేశారు.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!