Karnataka: డిజిటల్ పేమెంట్లతో బీజేపీ గాలం వేసింది.. కాంగ్రెస్ ఆరోపణ
కర్ణాటకలో డిజిటల్ పేమెంట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. మూడో దశ ఎన్నకల్లో భాగంగా ఓటర్లకు బీజేపీ ఫోన్ పే ద్వారా డబ్బులు పంచిందని కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో మూడో దశ పోలింగ్ జరిగింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. అయితే బీజేపీ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డిజిటల్ పేమెంట్లతో ఓటర్లకు డబ్బులు పంచినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయిని ప్రియాంక్ ఖర్గే చెప్పారు. ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఫోన్ పే ద్వారా పలువురికి డబ్బులు పంపించినట్లుగా తమ దగ్గర ఫ్రూప్స్ ఉన్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Murder: భార్య, కుమార్తెను చంపేసి ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త.. విషమ పరిస్థితులలో కొడుకు..
Also Read
సేడం, చిత్తాపూర్ నియోజకవర్గాలలో BJP నేరుగా PhonePeని ఉపయోగించి ఓటర్లకు లంచం ఇచ్చిందన్నారు. అటువంటి లావాదేవీలకు సంబంధించిన మరిన్ని ఆధారాలతో మేము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు. ఆన్లైన్లో ఓటర్లకు లంచాలు ఇస్తున్నట్లు గతేడాది నుంచి వార్తలు వస్తున్నాయి. దేశంలో ఒక రోజులో అధిక మొత్తంలో ఆన్లైన్ లావాదేవీలు జరుగుతున్నందున అధికారులకు ఇది సవాల్గా మారనుంది. ఇదిలా ఉంటే మూడో దశ ఎన్నికల్లో భాగంగా 61.45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: PM Modi: బీజేపీకి 400 సీట్లు ఎందుకు కావాలంటే..? వివరించిన పీఎం మోడీ..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Thyroid Health : వారసత్వంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయా.? నిపుణులు చెబుతున్న కీలక సూత్రాలు..!
-
Oil Crisis: భారత్కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో