కర్ణాటకలో డిజిటల్ పేమెంట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. మూడో దశ ఎన్నకల్లో భాగంగా ఓటర్లకు బీజేపీ ఫోన్ పే ద్వారా డబ్బులు పంచిందని కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో మూడో దశ పోలింగ్ జరిగింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. అయితే బీజేపీ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డిజిటల్ పేమెంట్లతో ఓటర్లకు డబ్బులు పంచినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయిని ప్రియాంక్ ఖర్గే చెప్పారు. ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఫోన్ పే ద్వారా పలువురికి డబ్బులు పంపించినట్లుగా తమ దగ్గర ఫ్రూప్స్ ఉన్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Murder: భార్య, కుమార్తెను చంపేసి ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త.. విషమ పరిస్థితులలో కొడుకు..
సేడం, చిత్తాపూర్ నియోజకవర్గాలలో BJP నేరుగా PhonePeని ఉపయోగించి ఓటర్లకు లంచం ఇచ్చిందన్నారు. అటువంటి లావాదేవీలకు సంబంధించిన మరిన్ని ఆధారాలతో మేము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు. ఆన్లైన్లో ఓటర్లకు లంచాలు ఇస్తున్నట్లు గతేడాది నుంచి వార్తలు వస్తున్నాయి. దేశంలో ఒక రోజులో అధిక మొత్తంలో ఆన్లైన్ లావాదేవీలు జరుగుతున్నందున అధికారులకు ఇది సవాల్గా మారనుంది. ఇదిలా ఉంటే మూడో దశ ఎన్నికల్లో భాగంగా 61.45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: PM Modi: బీజేపీకి 400 సీట్లు ఎందుకు కావాలంటే..? వివరించిన పీఎం మోడీ..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.