Karnataka: డిజిటల్ పేమెంట్లతో బీజేపీ గాలం వేసింది.. కాంగ్రెస్ ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో డిజిటల్ పేమెంట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. మూడో దశ ఎన్నకల్లో భాగంగా ఓటర్లకు బీజేపీ ఫోన్ పే ద్వారా డబ్బులు పంచిందని కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో మూడో దశ పోలింగ్ జరిగింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. అయితే బీజేపీ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డిజిటల్ పేమెంట్లతో ఓటర్లకు డబ్బులు పంచినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయిని ప్రియాంక్ ఖర్గే చెప్పారు. ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఫోన్ పే ద్వారా పలువురికి డబ్బులు పంపించినట్లుగా తమ దగ్గర ఫ్రూప్స్ ఉన్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Murder: భార్య, కుమార్తెను చంపేసి ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త.. విషమ పరిస్థితులలో కొడుకు..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
సేడం, చిత్తాపూర్ నియోజకవర్గాలలో BJP నేరుగా PhonePeని ఉపయోగించి ఓటర్లకు లంచం ఇచ్చిందన్నారు. అటువంటి లావాదేవీలకు సంబంధించిన మరిన్ని ఆధారాలతో మేము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు. ఆన్లైన్లో ఓటర్లకు లంచాలు ఇస్తున్నట్లు గతేడాది నుంచి వార్తలు వస్తున్నాయి. దేశంలో ఒక రోజులో అధిక మొత్తంలో ఆన్లైన్ లావాదేవీలు జరుగుతున్నందున అధికారులకు ఇది సవాల్గా మారనుంది. ఇదిలా ఉంటే మూడో దశ ఎన్నికల్లో భాగంగా 61.45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: PM Modi: బీజేపీకి 400 సీట్లు ఎందుకు కావాలంటే..? వివరించిన పీఎం మోడీ..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!