Lok Sabha Election 2024 : నేటి ఓటింగ్ రోజున ఏది క్లోజ్.. ఏది ఓపెన్ ఉంటుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election 2024 : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్ జరగబోతోంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఈ రోజు ఉదయం 7 గంటలకు తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్య పండుగలో ఎక్కువ మంది పాల్గొని ఓటు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం సన్నాహాలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఓటు వేసేందుకు వీలుగా పలు సంస్థలకు సెలవు ప్రకటించారు. ఏది మూసివేయబడుతుందో.. ఏది తెరవబడుతుందో తెలుసుకుందాం.
బ్యాంకులు ఎక్కడ మూసివేయబడతాయి?
లోక్సభ ఎన్నికల దృష్ట్యా, చెన్నై, అగర్తల, డెహ్రాడూన్, షిల్లాంగ్, నాగ్పూర్, రాజస్థాన్లోని జైపూర్, ఇటానగర్, కోహిమా, ఐజ్వాల్లలో ఈరోజు బ్యాంకులు మూసివేయబడతాయి.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఏయే రాష్ట్రాల్లో సెలవులు ఉంటాయి?
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తమిళనాడు, నాగాలాండ్, ఉత్తరాఖండ్లలో సెలవు ప్రకటించారు.
ఏమి ఓపెన్ అవుతుంది?
స్టాక్ మార్కెట్ ఈరోజు తెరిచి ఉంటుంది. మహారాష్ట్రలోని ముంబైలో ఈ రోజున ఎన్నికలు జరగనున్నందున, మే 20న మాత్రమే మార్కెట్ మూసివేయబడుతుందని NSE ఇటీవల ప్రకటించింది. ప్రైవేట్ కార్యాలయంలో సెలవు ప్రకటించకపోతే అది కూడా తెరిచి ఉంటుంది.
ఏది మూసివేయబడుతుంది?
ఉత్తరాఖండ్, తమిళనాడు, నాగాలాండ్లో ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడతాయి. ఈ సమయంలో పాఠశాలలు,కళాశాలలు కూడా తెరవబడవు.
ఏయే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి?
తొలి దశలో, తమిళనాడు 39, ఉత్తరాఖండ్ 5, అరుణాచల్ ప్రదేశ్ 2, మేఘాలయ 2, అండమాన్ నికోబార్ దీవులు 1, మిజోరం 1, నాగాలాండ్ 1, పుదుచ్చేరి 1, సిక్కిం 1 మరియు లక్షద్వీప్ 1 ఎంపీ స్థానాలతో పాటు రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సాం, మహారాష్ట్రలో 5, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, మణిపూర్లో 2, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. వీటిలో పాటు అరుణాచల్ ప్రదేశ్ (60 సీట్లు), సిక్కిం (32 సీట్లు)లో అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!