Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. మృతి చెందిన వారిలో లోకో పైలట్, సహాయకుడు
- కాంచనజంగా ఎక్స్ప్రెస్-గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో ఇప్పటివరకు 8 మృతి
- ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారని తెలిపిన రైల్వే అధికారులు
- ముగిసిన సహాయక చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పైగురిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టిన ఘటనలో ఇప్పటివరకు 8 మృతి చెందారు. అందులో ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఐదుగురు ప్రయాణికులు, ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారు. గూడ్స్ రేక్లోని లోకోమోటివ్ పైలట్, అసిస్టెంట్ లోకోమోటివ్ పైలట్, ఎక్స్ప్రెస్ రైలులోని గార్డు మరణించారు. దాదాపు 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఎక్స్ప్రెస్ రైలులోని చివరి రెండు కోచ్లు గార్డు కోచ్, కార్గో వ్యాన్ అని అధికారులు తెలిపారు. దాదాపు 200 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ సీల్దా వైపు వెళుతోంది. అంతలో వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొంది. దీంతో ప్యాసింజర్ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ముగిశాయి. ఈ ప్రమాదంతో కనీసం 10 రైళ్లను దారి మళ్లించారు.
Read Also: IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్ లో ఉరి వేసుకున్న విద్యార్థిని..
Also Read
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. 'ఆరెంజ్ క్యాప్' విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ఈ ప్రమాదంపై ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సబ్యసాచి డి మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని, కొన్ని రైళ్లను దారి మళ్లించినప్పటికీ, అలుబారి-సిలిగురి-న్యూ జల్పైగురి లైన్ ఉన్నందున రాకపోకలకు ఆటంకం ఉండదని చెప్పారు. ఎంఎస్ సిన్హా మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ చేపడుతామని.. ఈ రైలు మార్గంలో కవాచ్ యాంటీ-కొలిజన్ సిస్టమ్ను అమలు చేయలేదని అంగీకరించారు. కేవలం ఢిల్లీ-గౌహతి మార్గంలో ప్లాన్ చేసినట్లు ఆమె తెలిపారు. గత ఏడాది జూన్లో ఒడిశాలోని బాలాసోర్లో ట్రిపుల్ రైలు ఢీకొన్న ఘటనలో 293 మంది మృతి చెందగా, 1,200 మందికి పైగా గాయపడిన తర్వాత దేశీయంగా అభివృద్ధి చెందిన కవాచ్ వ్యవస్థ లేకపోవడం గురించి కూడా చర్చ జరిగింది.
Read Also: Minister Satyakumar: రుయా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సత్యకుమార్
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!