India China: పాక్ ప్రయోగించిన PL-15E క్షిపణిని కూల్చేసిన భారత్.. తొలిసారి స్పందించిన చైనా.
- పాక్ ప్రయోగించిన PL-15E క్షిపణిని కూల్చేసిన భారత్..
- తొలిసారిగా భారత వ్యాఖ్యలపై స్పందించిన చైనా..
India China: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్కి చెందిన చైనీస్ ఆయుధాలను, పరికరాలను తుక్కు తుక్కు చేసింది. ముఖ్యంగా చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని దెబ్బకొట్టింది. ఇదే కాకుండా చైనా పాకిస్తాన్కి అందించిన PL-15E క్షిపణిని భారత్ కుప్పకూల్చింది. భారత్ ఇటీవల పాకిస్తాన్ ప్రయోగించిన చైనా ఆయుధాల పనితీరుపై వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై తొలిసారిగా చైనా ఆర్మీ స్పందించింది. భారత్ చేస్తున్న వ్యాఖ్యల్ని తిరస్కరించింది.
చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియావోగాంగ్ మాట్లాడుతూ.. భారత్ పేలని PL-15Eని స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ఇది రాడార్ గైడెడ్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి, చైనా తయారు చేసిన అత్యంత అధునాతన రాకెట్ అని చెబుతుంటారు. ‘‘మీరు పేర్కొన్న క్షిపణి ఎగుమతి చేసిన పరికరం. స్వదేశంలో, విదేశాల్లో రక్షణ ప్రదర్శనల్లో చాలాసార్లు ప్రదర్శించబడింది’’ అని జాంగ్ అన్నారు. మే 7-10 మధ్య జరిగిన భారత్-పాకిస్తాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా చైనా రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Radhika Apte : పూరీ-విజయ్ సేతుపతి మూవీలో రాధికా ఆప్టే.. ఇదిగో క్లారిటీ..
భారత్, పాకిస్తాన్లు తొలగించలేని పొరుగు దేశాలని, పాకిస్తాన్కి వైమానిక రక్షణ, ఉపగ్రహ మద్దతు అందించిందని, చైనా ఆయుధ వ్యవస్థ సగటు కన్నా తక్కువగా పనిచేస్తుందని భారత అధికారుల చేస్తున్న వాదనల్ని జాంగ్ తిరస్కరించారు. చైనా ఆయుధాలను తొలిసారిగా పాకిస్తాన్ సంఘర్షణలో ఉపయోగించడాన్ని ఆ దేశం కీలకంగా గమనించింది. అయితే, భారత్ పాక్ ఉపయోగించిన చైనా వ్యవస్థల్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ దేశానికి చెందిన రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని మన మిస్సైల్స్ అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయి.
మరోవైపు, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) ఇటీవలి నివేదిక ప్రకారం, 2020 నుండి 2024 వరకు చైనా యొక్క అన్ని వాతావరణ మిత్రదేశమైన ఆయుధాల కొనుగోలులో 81 శాతం వాటాను కలిగి ఉన్న చైనా పాకిస్తాన్కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా అవతరించింది. కొనుగోలులో తాజా జెట్ ఫైటర్లు, రాడార్లు, నావికా నౌకలు, జలాంతర్గాములు మరియు క్షిపణులు ఉన్నాయి. రెండు దేశాలు సంయుక్తంగా పాకిస్తాన్ వైమానిక దళం (PAF)కి ప్రధానమైన J-17 విమానాలను తయారు చేశాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!