Delhi: కాలుష్యం ఎఫెక్ట్.. ప్రభుత్వ కార్యాలయాల సమయాల మార్పు
- ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా ఉంది. అధిక కాలుష్యంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను వేర్వేరు సమయాల్లో తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:30 వరకు తెరిచి ఉంటాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా ఉంది. అధిక కాలుష్యంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను వేర్వేరు సమయాల్లో తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:30 వరకు తెరిచి ఉంటాయి. ఈ టైమ్టేబుల్ ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో 2025 ఫిబ్రవరి 28 వరకు అమలులో ఉండనుంది.
Read Also: Rajnath Singh: కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్
Also Read
ఢిల్లీ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. కాలుష్యం కారణంగా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల సమయాలను మార్చినట్లు తెలిపింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన సూచనలలో.. GRAP నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాల సమయాల మార్పుకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 8.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10.00 నుండి సాయంత్రం 6.30 వరకు తెరిచి ఉంటాయి.
Read Also: Amitabh Bachchan: ఇందుకే కాబోలు బిగ్బి అయ్యింది.. 82 ఏళ్ల వయస్సులోనూ తైక్వాండో కిక్ (వీడియో)
కార్యాలయ సమయాల్లో ఈ మార్పు 28 ఫిబ్రవరి 2025 వరకు అమలులో ఉంటుంది. ఇదిలా ఉండగా.. గ్రేప్-4 కింద విధించిన ఆంక్షలను అమలు చేసేందుకు తక్షణమే బృందాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ-ఎన్సీఆర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. AQI (గాలి నాణ్యత సూచిక) 450 కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 12వ తరగతి వరకు తరగతులు నిర్వహించడంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని అన్ని ఢిల్లీ-ఎన్సీఆర్ రాష్ట్రాలను కోర్టు కోరింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!