కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన సినిమాలకు సెపరేట్ ప్యాన్ బేస్ ఉంది. ఆయన తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి తో ‘లియో’ సినిమాను తెరకేక్కించారు. ఈ చిత్రం అక్టోబర్ 19 న దసరా కానుకగా రిలీజ్ అయ్యింది.మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఫ్లాష్ బ్యాక్ బాగోలేదంటూ చాలా చోట్ల నుంచి ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే లోకేష్ గత చిత్రం ‘విక్రమ్’ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ‘లియో’ కి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగింది.. టాక్ తేడాగా ఉన్నా ఈ మూవీ దసరా సెలవుల్లో భారీగానే కలెక్షన్స్సాధించింది.అయితే సినిమా రిలీజ్ రోజు నుంచి మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన లోకేష్ తాజాగా ఓ మీడియా వ్యక్తితో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ నేపధ్యంలో లోకేష్ ని మీడియా వారు ఈ నెగిటివ్ టాక్ గురించి అడిగారు.
లోకేష్ మాట్లాడుతూ.. లియో సినిమాని జనం బాగా ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే తాను నెట్ వర్క్ కవరేజ్ ఏరియాకు దూరంగా ఉన్నానని, మరో నాలుగైదు రోజులు వెయిట్ చేసి అప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ ఏమిటనేది తెలుసుకుంటానని ఆయన చెప్పారు. ఆ కామెంట్స్ ని బట్టి తన తదుపరి చిత్రానికి సంభందంచి మార్పులు, చేర్పులు ఏమైనా అవసరమైతే చేస్తానని అన్నారు. ప్రస్తుతానికి అయితే తాను రివ్యూలు గురించి అంతగా తెలుసుకోలేదని చెప్పుకొచ్చారు.తన సినిమా రిలీజ్ ప్రతీ సారి లోకేష్ ఇలాగే చేస్తారని సమాచారం.ఇక లియో ప్రీ రిలీజ్ బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం 220 కోట్ల షేర్, 420 కోట్ల గ్రాస్ వసూళ్లు అని తెలుస్తోంది. ఈ సినిమా మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. టాక్ తో సంబందం లేకుండా నాలుగో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకుపోతుంది