Lavu Krishna Devarayalu : నదుల అనుసంధానంపై కూడా చర్చ జరగాలని కోరాం
- పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
- పాల్గొన్న టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు
- ఏపీ విభజన అంశాల్లో కొన్ని పూర్తయ్యాయు, ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి
- 10 ఏళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్లో చర్చ జరగాలని కోరాను లావు కృష్ణదేవరాయులు
Lavu Krishna Devarayalu : రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఏపీ విభజన అంశాల్లో కొన్ని పూర్తయ్యాయు, ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయన్నారు. 10 ఏళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్ లో చర్చ జరగాలని కోరానని, కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో నెలకున్న పరిస్థితి, జాప్యానికి కారణాల పై కూడా చర్చ జరగాలని కోరానని ఆయన మీడియాకు తెలిపారు. విభజన హామీల్లో కొన్ని సంస్థలకు శాశ్వత కట్టడాలు వచ్చాయి. మరికొన్ని సంస్థలు ఏర్పాటు కావాలన్నారు లావు కృష్ణదేవరాయులు. విజయవాడ లో వరద భీభత్సం నేపథ్యం లో, దేశంలో పలు నగరాలు, పట్టణాలను వరదలు ముంచెత్తుతున్నాయని, ప్రకృతి వైపరీత్యాల పై పార్లమెంటులో విపులంగా చర్చ జరగాలని కోరానని ఆయన తెలిపారు.
Mann Ki Bath: కాలేజీ రోజులను గుర్తుచేసుకున్న ప్రధాని.. మన్కీ బాత్లో మోడీ ఏం మాట్లాడారంటే?
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
అంతేకాకుండా..’ నదుల అనుసంధానంపై కూడా చర్చ జరగాలని కోరాను. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం తో ఏపీలో 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏపీలో జరిగే నదుల అనుసంధానం దేశానికే ఆదర్శం, స్పూర్తిదాయకం కావాలి. కౌలు రైతుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఆచార్య రంగా శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో, కౌలు రైతుల ఈతిబాధలు పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలి. అలాగే, వలస కార్మికుల కష్టాలు, సమస్యలను కూడా సమగ్ర చర్చించాలి. సోషల్ మీడియా విశృంఖలత్వం పై చర్చ తో పాటు, కట్టడి చేసేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. “వక్ఫ్” పై చర్చ పూర్తి కాలేదు. ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి. ముస్లింల అభీష్టం మేరకు, బిల్లు రూపకల్పన జరగాలి. అదానీ వ్యవహారంలో ఏపి ప్రస్తావన రావడం దురదృష్టకరం. ఏపీకి ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా ఇలాంటి సంఘటనలకు కారకులైన వారిని సమర్ధించే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఎవరిని సమర్థించకూడదో తెలుసుకోవాలి, గ్రహించాలి.’ అని లావు కృష్ణదేవరాయులు వ్యాఖ్యానించారు.
Mann Ki Bath: కాలేజీ రోజులను గుర్తుచేసుకున్న ప్రధాని.. మన్కీ బాత్లో మోడీ ఏం మాట్లాడారంటే?
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!