Last Rites For Cow: గోమాతకు అంతిమ వీడ్కోలు.. ఘనంగా అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన సంప్రదాయంలో అంత్యక్రియలకు ఎంతో పవిత్రత ఉంది. అనారోగ్యం, ఇతర కారణాల వల్ల అయినవారు కాలం చేస్తే వారిని సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు చేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరుస్తాం. అంత్యక్రియలు వైభవంగా నిర్వహిస్తాం. అశువులు బాసిన అందాల రాణి గోమాతకు కడసారి వీడ్కోలు పలికారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో బహుమతులు సాధించిన గోమాతను సాగనంపారు. గుమ్మిలేరులో గోమాతకు దశదినకర్మలు నిర్వహించారు. బంధుమిత్రులకు దిన భోజనాలు ఏర్పాటుచేశారు.
Read Also: Kiran Abbavaram: అన్నమాచార్య వారసులను సన్మానించిన ‘వినరో భాగ్యము…’ చిత్ర బృందం
Also Read
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!

గోవును దేవతగా పూజించే సంస్కృతి మనది. కొందరు రైతులు ఆవులు మృతి చెందితే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరపడమే గాక దశదినకర్మలను చేపడుతుంటారు. ఇందులో భాగంగానే ఆవుల అందాల పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో బహుమతులు సాధించి ఇటీవల ఆశువులు బాసిన గోమాతకు దశ దశదిన కర్మను నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో ఒకరైతు ఇంట్లో 21 సంవత్సరాల పాటు పెరిగిన ఆవు మృతి చెందటంతో దానికి అంత్యక్రియలు నిర్వహించటమే కాకుండా దశదిన కర్మను సైతం జరిపించారు.


అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన రైతు రెడ్డి సత్తిబాబుకు అరుదైన పుంగనూరు జాతికి చెందిన ఆవు దూడ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పశువుల అందాల పోటీలు జరిగినా ఆ పుంగనూరు ఆవుదే మొదటి బహుమతి. పాల పోటీల్లో కూడా తనదే పైచేయిగా ఉండేది. 21 సంవత్సరాల వయసున్న ఈ పుంగనూరు14 సంవత్సరాల పాటుగా వందలాది ఆవుల సంతతికి దోహదపడింది. అటువంటి అరుదైన ఆవు తెలుగు రాష్ట్రాలలో జరిగిన పశువుల అందాల పోటీలు,పాల పోటీలలో ఎన్నో బహుమతులు సాధించి రైతుకు ఎంతో గుర్తింపు తెచ్చింది.
అటువంటి అరుదైన అవు ఈనెల మూడున మృతి చెందింది. అప్పుడు శాస్త్రోక్తంగా కర్మకాండలు జరిపించారు. అలాగే తన మకాం వద్ద ఆవు చిత్ర పటంతో పూజలు నిర్వహించి అనంతరం వందలాది మంది బంధుమిత్రులు, రైతులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతు సత్తిబాబు మాట్లాడుతూ మాకూ, మాగ్రామానికి ఎంతో పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఈ గోవు మృతి చెందడంతో తామంతా తీవ్ర విషాదంలోకి వెళ్లామన్నారు. తమ కుటుంబ సభ్యులు మృతిచెందినట్లుగానే భావించి ఈ దశదినకర్మలు చేపట్టినట్లు రైతు రెడ్డి సత్తిబాబు, గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు వివరించారు.
Read Also: Bandla Ganesh: బండ్ల గుండు బాస్ లుక్.. కళ్లన్నీ ఆ కళ్లజోడు మీదే
- Tags
- 21 years
- alamuru
- Cow
- Cow Died
- Cow Photos
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!