TSLPRB : మహిళ అభ్యర్థుల అలర్ట్.. నేడే లాస్ట్ డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కోసం గర్భిణులు, బాలింతలు రాతపూర్వక అండర్ టేకింగ్ పత్రాన్ని సమర్పించే గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థులు వెంటనే డీజీపీ కార్యాలయంలోని ఇన్వర్డ్ సెక్షన్లో అండర్ టేకింగ్ అందించాలని అధికారులు సూచించారు. వీరికి నేరుగా మెయిన్స్ పరీక్ష రాసేందుకు వీలు కలుగుతుంది. నిర్ణీత గడువులోగా ఈవెంట్స్కు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే.. పోలీస్శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన గర్భిణులు, బాలింతలకు నేరుగా మెయిన్స్ రాసేందుకు పోలీస్ నియామక బోర్డు అవకాశం కల్పించింది.
Also Read : HCA: ఎన్టీఆర్ ని పిలిచాము కానీ రాలేదు – హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్
Also Read
కోర్టు ఆదేశాల మేరకు 7 మార్కులు కలపడంతో సుమారు 50 వేల మందికిపైగా అభ్యర్థులు ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన విషయం తెలిసిందే. వారికి ఫిబ్రవరి 15 నుంచి శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే 7 మార్కులు కలపడం వల్ల అర్హత సాధించిన వారిలో గర్భిణులు, బాలింతలు కూడా ఉన్నారు.
Also Read : T20 cricket: పొట్టి క్రికెట్లో మరీ ఇంత చెత్త రికార్డా..?
వారికి మినహాయింపుపై స్పందించిన అధికారులు గర్భిణులు, బాలింతలకు నేరుగా మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు పోలీస్ నియామక బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు. శరీర దారుఢ్య పరీక్షలకు హాజరు కాలేని గర్భిణులు, బాలింతలు ఫిబ్రవరి 28 వరకు రాతపూర్వకంగా అండర్టేకింగ్ సమరర్పించాలని ఆయన సూచించారు. లక్డీకాపూల్లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న పోలీస్ నియామక బోర్డు అధికారులకు అండర్టేకింగ్ సమర్పించాలన్నారు. అండర్ టేకింగ్ ప్రొఫార్మను నియామక బోర్డు వెబ్సైట్లో పొందుపర్చారు. మెయిన్స్లో అర్హత సాధించిన వారు నిర్ణీత గడువులోగా శరీర దారుఢ్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!