Karnataka: కర్ణాటకలో జైన మత గురువు హత్య.. ఇద్దరు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: డబ్బుల విషయంలో ఈ మధ్య కాలంలో హత్యలు పెరిగిపోతున్నాయి. డబ్బులు ఇచ్చిన వారు.. తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు దాడులు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన వారు.. డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వారినే హత్య చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చూస్తున్నాము. ఇపుడు కర్ణాటకలో కూడా ఒక మత గురువు కూడా ఇదే విషయంలో హత్య చేయబడ్డాడు. కర్ణాటకలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన జైన మత గురువు హత్య గావించబడ్డాడు. జైన మత గురువు హత్య కేసులు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రం బెలగావిలోని చికోడి తాలూకాలోని ఒక గ్రామంలో కొనసాగుతున్న ఆశ్రమం నుండి బుధవారం ఒక జైన మత గురువు అదృశ్యమయ్యాడు. అదృశ్యమైన జైన మతగురువు 4 రోజుల తరువాత హత్యకు గురైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసు అధికారులు ప్రకటించారు.
Read also: Donkey Attack on Man: వ్యక్తిపై గాడిద దాడి.. కాలుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ఆచార్య శ్రీ కామకుమార నంది మహారాజ్ గత 15 సంవత్సరాలుగా నంది పర్వత జైన బసదిలో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. దర్శనమివ్వడం లేదని భక్తులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జూలై 6న జైన ముని అదృశ్యంపై బసది మేనేజర్ భీమప్ప ఉగారే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని.. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే జైన మత గురువు మృతదేహం కోసం తమ అన్వేషణ కొనసాగుతోందని పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు నిందితులను విచారించగా.. దర్శినిని హత్య చేసి, మృతదేహాన్ని విసిరివేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులు మత గురువు వద్ద డబ్బు అప్పుగా తీసుకున్నారని అధికారి తెలిపారు. ఈ డబ్బుల విషయంలోనే సన్యాసిని డబ్బు సంబంధిత విషయానికి హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసు అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..