Tragedy : విషాదంగా మారిన సచివాలయం ఉద్యోగి లలిత మిస్సింగ్
- కుంభాభిషేకం రేవు దగ్గర లలిత మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
- పెళ్లి కోసం లలితను మరో మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చారని సమాచారం
- నిన్న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన లలిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లా జీఎం.పేట సచివాలయ ఉద్యోగి ఆదృశ్యం కేసు విషాదంగా మారింది. కుంభాభిషేకం రేవు దగ్గర లలిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పెళ్లి కోసం లలితను మరో మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చారని సమాచారం. నిన్న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన లలిత. గత నెల 22న నిశ్చితార్థం, ఈనెల 22న పెళ్లి ఫిక్స్ అయింది. అయితే.. యువతి అదృశ్యమైన ఘటన మంగళవారం యు.కొత్తపల్లిలోని అమరవిల్లి గ్రామంలో జరిగింది. అమరవిల్లి గ్రామానికి చెందిన వాకా లలిత (25) అనే యువతి గత రెండు రోజుల నుండి కనబడటం లేదని తొండంగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు.
Dinesh Karthik: మళ్లీ బ్యాట్ పట్టనున్న దినేష్ కార్తీక్.. తొలి క్రికెటర్గా రికార్డు!
Also Read
తొండంగి మండలం జిఎం పేట గ్రామంలోని సచివాలయం లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్న లలితకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో లలిత తండ్రి వివాహం చేసేందుకు నిశ్చయించారు. ఈక్రమంలో వివాహానికి సంబంధించి మాటలు జరుగుతుండగా, ఉద్యోగానికి వెళుతున్నానని చెప్పి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబీకులు తెలిపారు. దీనిపై తొండంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు.. మృత్యు ఒడికి చేరే సరికి కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Fishermens Arrest: శ్రీలంక నేవీ అదుపులో 22 మంది తమిళ మత్స్యకారులు..
తాజావార్తలు
-
TVK Government Formation: తమిళనాడు కోటపై టీవీకే జెండా.. లెఫ్ట్ పార్టీలు, వీసీకే అండతో సీఎం పీఠంపై విజయ్!
-
Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్ది నీచ రాజకీయం’’.. విజయ్తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..
-
Tamil Nadu: ఎంకే.స్టాలిన్ మాస్టర్ ప్లాన్.. తమిళనాడు అట్టుడుకనుందా!?
-
Kalahandi Issues: డిజిటల్ ఇండియాలో ‘మంచమే’ అంబులెన్స్.. గర్భిణిని కిలోమీటరు మోసుకెళ్లిన గ్రామస్థులు!
-
Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి, ఇద్దరు డిప్యూటీలు..?