Lakhpati Didi Yojana: మహిళలకు వడ్డీ లేకుండా రూ. 5 లక్షలు.. షరతులు వర్తిస్తాయి
- కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ రంగంలో మహిళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా.
- 'లక్షపతి దీదీ యోజన' అనే పథకాన్ని ప్రారంభించింది.
- రూ. 5 లక్షల వరకు రుణం ఇవ్వబడుతుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakhpati Didi Yojana: భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. వివిధ వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ పథకాలను తీసుకువస్తుంది. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకురావడానికి కారణం ఇదే. గతేడాది కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ‘లక్షపతి దీదీ యోజన’ అనే పథకాన్ని ప్రారంభించింది. పరిశ్రమ రంగంలో మహిళలను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం. పరిశ్రమల ఏర్పాటుకు వారికి ఆర్థిక సాయం అందించదానికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తుంది. ఇందుకోసం మహిళలు కొన్ని షరతులు పాటించాలి.
Happy Birthday Sarfaraz Khan: సర్పరాజ్ కు డబుల్ ధమాకా.. పుట్టినరోజుకు అదిరిపోయే గిఫ్ట్
Also Read
- CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
- ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
- Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
- Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
లఖపతి దీదీ పథకం అంటే?
మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. లఖపతి దీదీ యోజన కూడా అదే ప్రయత్నం. స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న మహిళల కోసం ఈ పథకం అమలు చేయబడింది. ఈ పథకం ద్వారా మహిళలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి సహాయం చేస్తారు. స్త్రీలు స్వయం ఉపాధికి ముందుకొస్తారు. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద శిక్షణ ఇస్తారు. ఆపై సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణం ఇస్తారు. ఈ పథకం కింద 3 కోట్ల మంది మహిళలను లఖపతి దీదీ పథకంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
లఖపతి దీదీ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని పత్రాలు మహిళలు అందించాల్సి ఉంటుంది. ఈ పథకంలో అత్యంత ముఖ్యమైన షరతు ఏంటంటే.. ఈ పథకం కింద ఎవరైనా మహిళ దరఖాస్తు చేసుకుంటే.. వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరూ ఉండకూడదు. అలాగే వీరి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి . 3 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్న మహిళలు ఈ పథకం కింద ప్రయోజనాలకు అర్హులు కాదు.
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే దర్శన టికెట్లతో పాటు వివిధ సేవా టికెట్లు విడుదల
పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
లఖపతి దీదీ యోజన పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్వయం సహాయక బృందం కింద మహిళల కోసం వ్యాపార ప్రణాళికను రూపొందించాలి. వారి వ్యాపార ప్రణాళిక రూపొందించిన వెంటనే, స్వయం సహాయక బృందం ద్వారా ఆ ప్రణాళిక ప్రభుత్వానికి పంపబడుతుంది. దాంతో ప్రభుత్వ అధికారులు దరఖాస్తును సమీక్షిస్తారు. ఆ తర్వాత, దరఖాస్తును ఆమోదించినట్లయితే పథకం ప్రయోజనం ఇవ్వబడుతుంది. దాని కింద రూ. 5 లక్షల వరకు రుణం ఇవ్వబడుతుంది.
తాజావార్తలు
-
Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
-
NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
-
CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
-
Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..