She MARTS: లఖ్పతి దీదీ నుండి షీ మార్ట్స్, బాలికల హాస్టళ్ల వరకు.. బడ్జెట్ 2026లో మహిళలపై వరాల జల్లు
- 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్
- బడ్జెట్ 2026లో మహిళలపై వరాల జల్లు
- లఖ్పతి దీదీ నుండి షీ మార్ట్స్, బాలికల హాస్టళ్ల వరకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో మహిళలపై వరాల జల్లు కురిపించారు. లఖ్పతి దీదీ పథకం, షీ మార్ట్స్, బాలికల వసతి గృహాల ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మరి, ఈ బడ్జెట్లో మహిళలకు ఏది ప్రత్యేకంగా ఉందో తెలుసుకుందాం?
Also Read:Budget 1947 vs 2026 Budget: భారత్లో మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
Also Read
- Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
- Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
లఖ్పతి దీదీ పథకం
కేంద్ర ప్రభుత్వం లఖ్పతి దీదీ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద, మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. దీని వలన వారు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించగలుగుతారు. ఈ రుణాలపై మహిళలు ప్రభుత్వ సబ్సిడీలను కూడా పొందుతారు.
‘షీ మార్ట్స్’
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లఖ్పతి దీదీ పథకం విజయవంతం అయిన తర్వాత, ఆర్థిక మంత్రి “షీ మార్ట్స్” ప్రకటించారు. ఈ మార్ట్స్ స్వయం సహాయక వ్యవస్థాపకులచే నిర్వహించనున్నారు. రిటైల్ అవుట్లెట్లుగా పనిచేస్తాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కొత్త పథకం మహిళా వ్యవస్థాపకులకు పెద్ద మార్కెట్ను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద, మహిళలు తమ సొంత బ్రాండ్లను సృష్టించుకోవడమే కాకుండా గణనీయమైన లాభాలను కూడా ఆర్జించొచ్చు. ఇది స్థానిక స్వయం సహాయక బృందాలను కూడా బలోపేతం చేస్తుంది.
Also Read:Customs Duty: కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతో తక్కువ ధరకే మొబైల్ ఫోన్ బ్యాటరీలు, ఈవీలు..
బాలికల వసతి గృహం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్లో మహిళా విద్యార్థులకు ఒక ముఖ్యమైన బహుమతిని ఇచ్చారు. ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లను ప్రారంభిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దేశవ్యాప్తంగా 700 కి పైగా జిల్లాల్లో బాలికల హాస్టళ్లకు పునాది రాయి వేయనున్నారు.
తాజావార్తలు
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!