Customs Duty: పార్లమెంట్లో బడ్జెట్ 2026–27ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంలో క్లీన్ ఎనర్జీ తయారీ రంగానికి సంబంధించి కీలకమైన ప్రతిపాదనలు చేసింది. లిథియం- ఐయాన్ సెల్స్ తయారీ కోసం ఉపయోగించే మూలధన కల్పనపై ఉన్న ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొనింది. దీంతో లిథియం- ఐయాన్ సెల్స్ ఉపయోగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (Battery Energy Storage Systems) తయారీ కూడా విస్తరించనున్నారు. ఈ నిర్ణయంతో లిథియం- ఐయాన్ బ్యాటరీ ఉత్పత్తి విస్తరణ, దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెంపు, స్వచ్ఛ ఇంధన రంగ అభివృద్ధికి ప్రోత్సాహం ఇస్తుంది అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
Read Also: Union Budget 2026-27: రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ..
అయితే, కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతో బ్యాటరీ తయారీ వ్యయాలు తగ్గనున్నాయి. ఇకపై బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) కోసం లిథియం- అయాన్ సెల్స్ తయారీలో వినియోగించే క్యాపిటల్ గూడ్స్కూ ఈ మినహాయింపు వర్తించనుంది. దీని ప్రభావంతో మొబైల్ ఫోన్ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్స్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు తక్కువ ధరలకు ఉత్పత్తులు అందుబాటులోకి రావడంతో పాటు ఈవీల వినియోగం మరింత పెరగనుంది. కాగా, ఈ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులు భారత్ను గ్లోబల్ క్లీన్ ఎనర్జీ హబ్గా మార్చే దిశగా మరో ముందడుగుగా ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.