Kushboo Sundar: మోదీ ఇంటిపేరుపై ఖుష్బూ చేసిన పాత ట్వీట్ వైరల్.. ‘పరువు నష్టం కేసు వేస్తారా?’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kushboo Sundar: ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో లోక్సభ సెక్రటేరియట్ ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సినీ నటి, బీజేపీ నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుఖుష్బూ సుందర్ గతంలో ప్రధాని మోదీ ఇంటి పేరుపై చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
2018 సంవత్సరంలో ఖుష్బూ కాంగ్రెస్లో ఉన్న సమయంలో మోదీ ఇంటిపేరు అవినీతిని సూచిస్తోందంటూ ఓ ట్వీట్ పెట్టారు. ‘ఇక్కడ మోదీ.. అక్కడ మోదీ.. ఎక్కడ చూసినా మోదీనే.. అసలేంటి ఇది?? ప్రతి మోదీ వెనుక భ్రష్టాచార్ ( అవినీతి ) అనే ఇంటి పేరు పెట్టాలి. మోదీ అంటేనే అవినీతి. మోదీ పేరును అవినీతిగా మార్చేద్దాం. అదే సరిగ్గా సరిపోతుంది. నీరవ్, లలిత్, నమో = అవినీతి’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంపీ దిగ్విజయ్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఖుష్బూ ట్వీట్ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. బీజేపీపై మండిపడుతున్నారు. ఖుష్బూపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నిస్తున్నారు. ‘మోదీ జీ.. ‘మోదీ’ ఇంటి పేరును అవినీతిగా పేర్కొన్న సుందర్పై పరువు నష్టం కేసు వేస్తారా..? ప్రస్తుతం ఆమె బీజేపీ సభ్యురాలిగా ఉన్నారు’ అంటూ దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సభ్యురాలిగా ఉన్న ఖుష్బూ 2020 అక్టోబర్లో బీజేపీలోకి చేరారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
Read Also: Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్.. కమలా హారిస్లతో కలిసి పేరడీ
‘మోదీ’ పేరుతో ఆమె చేసిన పాత ట్వీట్ ఈరోజు వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీపై సర్వత్రా దాడిని ప్రారంభించిన బీజేపీ నాయకురాలు ఖుష్బూ స్పందించారు. ప్రతిపక్ష పార్టీ ఎంత నిరాశకు లోనవుతోందో దీనివల్ల బయటపడిందని ఆమె అన్నారు.”వారు (కాంగ్రెస్ పార్టీ) ఎంత నిరాశలో ఉన్నారో చూపడమే కాకుండా, వారు లేవనెత్తుతున్న సమస్యపై వారి అజ్ఞానాన్ని ఇది బహిర్గతం చేస్తుంది” అని ఆమె అన్నారు. మోడీ ఇంటిపేరును “దొంగలు”తో సమానం చేయడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖుష్బూ పాత ట్వీట్ను ఎంచుకుంది. కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ సింగ్ శనివారం ఉదయం ట్విట్టర్ పోస్ట్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని ‘మీ శిష్యులలో ఒకరైనా ఖుష్బు సుందర్పై కూడా పరువు నష్టం కేసు పెట్టేలా చేస్తారా’ అని ప్రశ్నించారు.
Read Also: Ladakh: లడఖ్లో త్వరలోనే 4జీ, 5జీ సేవలు.. 500 మొబైల్ టవర్లు మంజూరు
తాను తన టైమ్లైన్లోని ఏ ట్వీట్లను ఎప్పుడూ తొలగించలేదు, ఇప్పుడు అలా చేయనని ఖుష్భూ సుందర్ చెప్పారు. కాంగ్రెస్ నేతలు నన్ను ఎంచుకుని ఏం చేయాలని చూస్తున్నారు? నన్ను రాహుల్ గాంధీతో సమానం చేస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు. తాను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహించానని ఖుష్భూ చెప్పుకొచ్చారు. ‘మోదీ’ ఇంటిపేరును అవమానించడంలో తప్పు కనిపించలేదా అని ఆమెను ప్రశ్నించగా.. ‘రాహుల్ గాంధీ మోదీలందరినీ దొంగలు అని పిలిచే స్థాయికి దిగజారారు, నేను ‘అవినీతి’ అనే పదాన్ని మాత్రమే ఉపయోగించానన్నారు. వారికి దమ్ము ఉంటే తనపై కేసు పెట్టాలని, వారిని చట్టపరంగా ఎదుర్కొంటానని కాంగ్రెస్ నేతలను సవాలు చేస్తున్నానన్నారు. అధికార బీజేపీ తీసుకున్న సానుకూల చర్యలను ఆమె ప్రశంసించడం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ నచ్చలేదని ఖుష్భూ సుందర్ ఎత్తి చూపారు. ట్రిపుల్ తలాక్ అయినా, ఆర్టికల్ 370 రద్దు అయినా, కొత్త విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రారంభించినా ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసినప్పుడు కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసిందని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!