Kushboo Sundar: మోదీ ఇంటిపేరుపై ఖుష్బూ చేసిన పాత ట్వీట్ వైరల్.. ‘పరువు నష్టం కేసు వేస్తారా?’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kushboo Sundar: ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో లోక్సభ సెక్రటేరియట్ ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సినీ నటి, బీజేపీ నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుఖుష్బూ సుందర్ గతంలో ప్రధాని మోదీ ఇంటి పేరుపై చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
2018 సంవత్సరంలో ఖుష్బూ కాంగ్రెస్లో ఉన్న సమయంలో మోదీ ఇంటిపేరు అవినీతిని సూచిస్తోందంటూ ఓ ట్వీట్ పెట్టారు. ‘ఇక్కడ మోదీ.. అక్కడ మోదీ.. ఎక్కడ చూసినా మోదీనే.. అసలేంటి ఇది?? ప్రతి మోదీ వెనుక భ్రష్టాచార్ ( అవినీతి ) అనే ఇంటి పేరు పెట్టాలి. మోదీ అంటేనే అవినీతి. మోదీ పేరును అవినీతిగా మార్చేద్దాం. అదే సరిగ్గా సరిపోతుంది. నీరవ్, లలిత్, నమో = అవినీతి’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంపీ దిగ్విజయ్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఖుష్బూ ట్వీట్ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. బీజేపీపై మండిపడుతున్నారు. ఖుష్బూపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నిస్తున్నారు. ‘మోదీ జీ.. ‘మోదీ’ ఇంటి పేరును అవినీతిగా పేర్కొన్న సుందర్పై పరువు నష్టం కేసు వేస్తారా..? ప్రస్తుతం ఆమె బీజేపీ సభ్యురాలిగా ఉన్నారు’ అంటూ దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సభ్యురాలిగా ఉన్న ఖుష్బూ 2020 అక్టోబర్లో బీజేపీలోకి చేరారు.
Also Read
- Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
- Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
- Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే "బీట్రూట్ హల్వా" ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
- IND Vs SL: టీమిండియాకు షాక్.. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ డకౌట్..
Read Also: Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్.. కమలా హారిస్లతో కలిసి పేరడీ
‘మోదీ’ పేరుతో ఆమె చేసిన పాత ట్వీట్ ఈరోజు వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీపై సర్వత్రా దాడిని ప్రారంభించిన బీజేపీ నాయకురాలు ఖుష్బూ స్పందించారు. ప్రతిపక్ష పార్టీ ఎంత నిరాశకు లోనవుతోందో దీనివల్ల బయటపడిందని ఆమె అన్నారు.”వారు (కాంగ్రెస్ పార్టీ) ఎంత నిరాశలో ఉన్నారో చూపడమే కాకుండా, వారు లేవనెత్తుతున్న సమస్యపై వారి అజ్ఞానాన్ని ఇది బహిర్గతం చేస్తుంది” అని ఆమె అన్నారు. మోడీ ఇంటిపేరును “దొంగలు”తో సమానం చేయడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖుష్బూ పాత ట్వీట్ను ఎంచుకుంది. కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ సింగ్ శనివారం ఉదయం ట్విట్టర్ పోస్ట్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని ‘మీ శిష్యులలో ఒకరైనా ఖుష్బు సుందర్పై కూడా పరువు నష్టం కేసు పెట్టేలా చేస్తారా’ అని ప్రశ్నించారు.
Read Also: Ladakh: లడఖ్లో త్వరలోనే 4జీ, 5జీ సేవలు.. 500 మొబైల్ టవర్లు మంజూరు
తాను తన టైమ్లైన్లోని ఏ ట్వీట్లను ఎప్పుడూ తొలగించలేదు, ఇప్పుడు అలా చేయనని ఖుష్భూ సుందర్ చెప్పారు. కాంగ్రెస్ నేతలు నన్ను ఎంచుకుని ఏం చేయాలని చూస్తున్నారు? నన్ను రాహుల్ గాంధీతో సమానం చేస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు. తాను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహించానని ఖుష్భూ చెప్పుకొచ్చారు. ‘మోదీ’ ఇంటిపేరును అవమానించడంలో తప్పు కనిపించలేదా అని ఆమెను ప్రశ్నించగా.. ‘రాహుల్ గాంధీ మోదీలందరినీ దొంగలు అని పిలిచే స్థాయికి దిగజారారు, నేను ‘అవినీతి’ అనే పదాన్ని మాత్రమే ఉపయోగించానన్నారు. వారికి దమ్ము ఉంటే తనపై కేసు పెట్టాలని, వారిని చట్టపరంగా ఎదుర్కొంటానని కాంగ్రెస్ నేతలను సవాలు చేస్తున్నానన్నారు. అధికార బీజేపీ తీసుకున్న సానుకూల చర్యలను ఆమె ప్రశంసించడం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ నచ్చలేదని ఖుష్భూ సుందర్ ఎత్తి చూపారు. ట్రిపుల్ తలాక్ అయినా, ఆర్టికల్ 370 రద్దు అయినా, కొత్త విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రారంభించినా ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసినప్పుడు కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసిందని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Rhea Chakraborty: సుశాంత్ మరణం నా జీవితాన్నే మార్చేసింది.. నాన్నకు ఉద్యోగం కూడా పోయింది: రియా చక్రవర్తి
-
Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
-
Anirudh – Kavya Maran Wedding : కావ్య మారన్ – అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ?
-
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
ట్రెండింగ్
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!