NTV Telugu Site icon

MP Kumari Selja: నా గుండెల్లో కాంగ్రెస్ రక్తం ఉంది.. ఆహ్వానించవద్దు, సలహా ఇవ్వవద్దు

Kumari Selja

Kumari Selja

బీజేపీలో చేరాల్సిందిగా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆహ్వానంపై సిర్సా ఎంపీ కుమారి సెల్జా స్పందించారు. ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన శైలజ.. కాంగ్రెస్ రక్తం తన సిరల్లో ఉందని అన్నారు. తాను కాంగ్రెస్‌వాదిగానే ఉంటానని సూటిగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి వైరం లేదని అన్నారు. రానున్న కాలంలో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలిపారు.

Read Also: Maharashtra: పూణే ఎయిర్పోర్ట్ పేరు మార్పు.. షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం

మరోవైపు.. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే సీఎం ఎవరు అని కుమారి శైలజను అడగ్గా.. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తనకు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉందని.. తనకు సలహాలు ఇస్తున్న, తన గురించి మాట్లాడే వ్యక్తుల గురించి మాట్లాడుతూ.. ‘నా దారి నాకు తెలుసు’ అని అన్నారు. తన మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. తనకు సలహా అవసరం లేదని సూచించారు.

Read Also: Hyderabad: హైదరాబాద్‌లో అత్యంత ధనవంతుడు ఇతనే.. నిరక విలువ సుమారు రూ. 5847 కోట్లు!

ఈ క్రమంలో.. మాజీ సీఎం ఖట్టర్ ఆహ్వానాన్ని కుమారి సెల్జా తిరస్కరించారు. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. పార్టీ అధిష్టానంతో సమావేశం గురించి.. అగ్రనేతలతో తరచూ చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. కాగా.. అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది. అక్టోబర్ 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.