KTR: కేసీఆర్కు నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- కేసీఆర్కు నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్కు నోటీసులు
- ప్రజాపాలన కాస్త కమీషన్ల పాలనగా మారిందన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్కు నోటీసులపై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలను గాలికి వదిలి నోటీస్ లు ఇస్తున్నారని రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని అన్నారు. ప్రజాపాలన కాస్త కమీషన్ల పాలనగా మారిందన్నారు. చట్టాల మీద విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని నోటీసులిచ్చినా హామీల అమలుపై ప్రభుత్వాన్ని వదలమని అన్నారు. ఇదంతా కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని కేటీఆర్ మండిపడ్డారు.
Also Read:Vaibhav Suryavanshi: ఒక్క సీజన్లో ఇన్ని రికార్డులా.. విధ్వంసానికి మొగుడిలా ఉన్నావే..
Also Read
- RCB Captain: ఆర్సీబీ కెప్టెన్ రేంజ్ అది.. క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు..
- LRLACM: భారత స్వదేశీ ‘‘తోమహాక్’’.. పాక్, చైనాలకు ముచ్చెమటలు గ్యారెంటీ..
- CM Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్తో ముందుకు ఏపీ.. సింగపూర్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- Rohit Sharma: చరిత్రకు మరో అడుగు దూరంలో రోహిత్ శర్మ.. భారీ స్కెచ్తో బరిలోకి..
గత 17 నెలలుగా పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు నాటకాలు ఆడుతోంది.. కమిషన్లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదు.. పాలన కనిపించడం లేదు.. డైరెక్ట్గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోంది.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే “కమిషన్లు లేనిదే పనులు జరుగడంలేదు” అని స్వయంగా సాక్ష్యంగా చెబుతున్నారు.. ఈ రాష్ట్రంలో కమిషన్ల పాలన నడుస్తోంది – ప్రజల పాలన కాదు.. సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నా.. SLBC టన్నెల్ కూలింది, 8 మంది ప్రాణాలు కోల్పోయారు.. అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేకపోయింది.. మీ కమిషన్ల అరాటంతో మృతదేహాలను వెలికితీయడానికి సైతం సాహసం చేయలేకపోయారు..
Also Read:UN Warns: 48 గంటల్లో గాజాలో 14 వేల మంది పిల్లలు చనిపోవచ్చు.. యూఎన్ హెచ్చరిక
అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది.. నల్గొండలో సుంకిషాల ప్రాజెక్ట్ కూలింది, ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు.. కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి, ప్రజల సమస్యలపై కాకుండా పచ్చినాటకంపై దృష్టి… కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొడుతున్నారు.. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి.. నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు.. మీరు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది.. తులం బంగారం ఏమైంది? 4 వేల రూపాయల పింఛన్లు ఏమయ్యాయి?.. మీరు ఎంత నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి.. మీవి అన్ని చిల్లర ప్రయత్నాలు మాత్రమే.. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించనున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
RCB Captain: ఆర్సీబీ కెప్టెన్ రేంజ్ అది.. క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు..
-
LRLACM: భారత స్వదేశీ ‘‘తోమహాక్’’.. పాక్, చైనాలకు ముచ్చెమటలు గ్యారెంటీ..
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్తో ముందుకు ఏపీ.. సింగపూర్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Rohit Sharma: చరిత్రకు మరో అడుగు దూరంలో రోహిత్ శర్మ.. భారీ స్కెచ్తో బరిలోకి..
-
Earthquake: చైనా, జపాన్లో భారీ భూకంపం.. కంపించిన భవనాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?