BRS : రైతు మహాధర్నాపై హైకోర్టులో కేటీఆర్ పిటిషన్
- నేడు నల్గొండలో కేటీఆర్ రైతు మహాధర్నా వాయిదా
- ఇవాళ్టి కేటీఆర్ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు
- హైకోర్టులో లంచ్మోహన్ పిటిషన్ వేసిన బీఆర్ఎస్
- కోర్టు తీర్పు వచ్చే వరకు కేటీఆర్ రైతు మహాధర్నను వాయిదా వేసిన బీఆర్ఎస్
- హైకోర్టు తీర్పు తర్వాత తేదీని ప్రకటించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే. తారక రామారావు (కేటీఆర్) నేతృత్వంలో నల్గొండలో నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రాజకీయ వాతావరణంలో కలకలం రేగింది. జనవరి 21న జరగాల్సిన ఈ మహాధర్నాకు చివరి నిమిషంలో అనుమతి రద్దయింది. పోలీసుల నిర్ణయంతో బీఆర్ఎస్ నాయకత్వం హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ధర్నాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో, పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ హామీల అమలుపై ప్రశ్నించే కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు చేసిన కుట్రగా బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ట్రాఫిక్ అంతరాయం, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని పేర్కొంటూ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సంక్రాంతి పండుగ సెలవులు ముగిసిన కారణంగా ప్రజలు హైదరాబాద్ బాట పట్టిన సమయంలో ధర్నా వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కావచ్చని పోలీసులు పేర్కొన్నారు.
Also Read
- Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే 'ER-100' ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
Rishabh Pant: వేలంలో పంజాబ్ తీసుకుంటుందేమోనని టెన్షన్ పడ్డా: పంత్
బీఆర్ఎస్ ఈ అనుమతి నిరాకరణను సవాలు చేస్తూ హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు మహాధర్నాను వాయిదా వేయనున్నట్టు బీఆర్ఎస్ అధినేతలు తెలిపారు. ఈ పరిణామం బీఆర్ఎస్ నాయకత్వం, కేటీఆర్ కార్యక్రమాలకు మోకాలడ్డే ప్రయత్నంగా వారు అభివర్ణిస్తున్నారు.
పోలీసుల నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, “ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్ర. కేటీఆర్ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి సర్కార్ భయపడుతోంది. హామీల అమలుపై ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమేంటి?” అని ప్రశ్నించారు.
రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీల అమలుపై గళమెత్తడం కోసం మహాధర్నా నిర్వహించాలనుకున్నారు. ఈ ధర్నాకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో, బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో పరిగణించారు. కానీ అనుమతి రాకపోవడం బీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహానికి దారితీసింది.
బీఆర్ఎస్ నేతలు పోలీసుల నిర్ణయాన్ని “ప్రజా సమస్యలను కప్పిపుచ్చే చర్య”గా అభివర్ణిస్తున్నారు. మహాధర్నా ద్వారా రైతుల సమస్యలు, ప్రభుత్వ హామీల అమలు, రేవంత్ రెడ్డి సర్కార్ విధానాలను ప్రశ్నించే అవకాశం కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ వాతావరణంలో తీవ్రమైన చర్చకు దారితీశాయి. హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మహాధర్నా భవిష్యత్తులో ఎలా కొనసాగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!