KTR : తెలంగాణ పరిశ్రమల అంశంపై కేటీఆర్ విమర్శలు
- బయ్యారంలో ఉక్కు పరిశ్రమ – కేంద్ర ప్రభుత్వ అసలు ఉద్దేశ్యం ఏమిటి?
- ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ – వేలానికి పెట్టడంపై పెరుగుతున్న విమర్శలు
- తెలంగాణ పరిశ్రమల విషయంలో మౌనం వీడని బీజేపీ, కాంగ్రెస్ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణలో ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందాల్సిన పరిశ్రమలు నాశనం అవుతున్నాయని, దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఊసేలేకుండా ఉండటం విచారకరమని తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేటీఆర్ తన ట్వీట్లో ప్రధానంగా బయ్యారంలోని ఉక్కు పరిశ్రమ స్థాపనపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. మరోవైపు, ఆదిలాబాద్లోని సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఫ్యాక్టరీను వేలానికి పెట్టడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కీలకమైన ఈ పరిశ్రమలను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు కేటీఆర్ విమర్శించారు.
బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా తెలంగాణ పరిశ్రమల సమస్యలపై ఒక్కరు కూడా స్పందించలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వారు కూడా ఈ అన్యాయాన్ని ప్రశ్నించలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలకు కొత్త పరిశ్రమలు కావాలని అడిగే నేతలు లేకపోవడంతో పాటు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలను కాపాడాలని అడగలేని పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలను కూల్చే పనిలో ఉండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటిని వేలానికి పెట్టే పనిలో ఉందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడుస్తూ, అభివృద్ధిని అడ్డుకునే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ ప్రజల అభివృద్ధిపై అసలు ఆసక్తి లేదని, వీరి దృష్టిలో ఓట్లు, సీట్లే ముఖ్యమని విమర్శించారు. తెలంగాణ ప్రజలు తమ హక్కుల కోసం ముందుకు రావాలని, రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమైన పరిశ్రమలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వాల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు.
Donald Trump: యుఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యాశాఖ రద్దు
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!