KTR: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాన మోడీకి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఆయన పలు అంశాలను పేర్కొన్నారు. ఈ ట్వీట్ లో పర్యావరణం పైన, ప్రధానిగా తన బాధ్యతల పైన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం ఇదని, కంచ గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాల పైన విచారణ చేపట్టి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి లో జరిగిన విధ్వంసం విషయంలో తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసం పైన ప్రధానమంత్రి మాట్లాడింది కేవలం బూటకం కాకుంటే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కంచ గచ్చిబౌలి అంశం కేవలం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 10వేలకోట్ల ఆర్థిక మోసం అంటూ పేర్కొన్నారు.
ఇప్పటికే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిబిఐ, ఆర్బిఐ, సెబి, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ సంస్థలకు ఆధారాలతో సహా కాంగ్రెస్ చేసిన పదివేల కోట్ల ఆర్థిక మోసం గురించి తెలియజేశాము. సుప్రీంకోర్టు పంపించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కూడా ఈ అంశంలో ఆర్థిక అవకతవకలు జరిగిన అంశాన్ని నిర్ధారించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల విభాగాల స్వతంత్ర విచారణ చేయాలని సూచించనాట్లు తెలిపారు. నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని.. అయితే నిసిగ్గుగా, అక్రమంగా వ్యవస్థలను మోసం చేసి పర్యావరణ విధ్వంసం చేసిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందంటూ పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలిలో చేసిన పదివేల కోట్ల రూపాయల ఆర్థిక అక్రమాల పైన వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటిగా కాదని… కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదని నిరూపించుకోవాలని ట్వీట్ లో పేర్కొన్నారు.
Dear Hon'ble Prime Minister @narendramodi ji,
I was heartened to hear your speech about the destruction of Kancha Gachibowli Forest by Telangana CM Revanth Reddy. However, I hope it's not just lip service
The devastation in Kancha Gachibowli is not just a grave environmental… pic.twitter.com/8byfzDwUkR
— KTR (@KTRBRS) April 18, 2025