KTR Case: హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ.. ఏసీబీ కేసుపై లంచ్మోషన్ పిటిషన్
- హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ
- ఏసీబీ కేసుపై కేటీఆర్ లంచ్మోషన్ పిటిషన్
- ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్
- కేటీఆర్ తరపున సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం వాదనలు
- కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవు- లాయర్
- రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ పై కేసు నమోదు చేశారు- లాయర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR case trial in High Court.. Lunch motion petition on ACB case: హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ కొనసాగుతుంది. ఏసీబీ కేసుపై కేటీఆర్ లంచ్మోషన్ పిటిషన్ వేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. కేటీఆర్ తరపున సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవని లాయర్ పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ పై కేసు నమోదు చేశారంటూ లాయర్ తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వల్ల హైదరాబాద్కు ప్రయోజనమే కలిగిందని లాయర్ అన్నారు. స్పాన్సర్ తప్పుకోవడం వల్ల హెచ్ఎండీఏ ద్వారా FEO కు చెల్లింపులు జరిగాయని కేటీఆర్ లాయర్ కోర్టుకు చెప్పారు.
Read Also: Atul Subhash Case: మనవడి కోసం సుప్రీంకోర్టుకి అతుల్ సుభాష్ తల్లి..
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
KTR పై ఏసీబీ తప్పుడు కేసు నమోదు చేసిందని కేటీఆర్ లాయర్ ఆర్యమా సుందరం కోర్టుకు తెలిపారు. 14 నెలల తర్వాత కేసు నమోదు చేయడంలోనే రాజకీయ కుట్ర అని అర్థమవుతుంది.. కరప్షన్ జరగనప్పుడు పీసీ యాక్ట్ కేటీఆర్ కు ఎలా వర్తిస్తుందని లాయర్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో స్పాన్సర్ వెనక్కి జరిగినప్పుడు.. ఈవెంట్ నిర్వహించకపోతే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఈ నిర్ణయం జరిగిందని లాయర్ తెలిపారు. ఈ ఏడాది 2024లో ఖచ్చితంగా నిర్వహించాలనే ఈ చెల్లింపులు జరిగాయి.. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ద్వారా హైదరాబాద్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.700 కోట్ల లాభం జరిగిందని లాయర్ పేర్కొన్నారు.
Read Also: Janaki vs State of Kerala: తెలుగులోకి మరో ఇంట్రెస్టింగ్ కోర్టు రూమ్ డ్రామా
కాంగ్రెస్ ప్రభుత్వం FEO కు మిగతా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిందని లాయర్ చెప్పారు. 2023 అక్టోబర్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే FEOకి చెల్లించారన్నారు. అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందని అన్నారు. పబ్లిక్ సర్వెంట్ నేర పూరిత దుష్ప్రవర్తన చేస్తే పీసీ యాక్ట్ పెట్టాలి.. కానీ ఫార్ములా ఈ కార్ రేసింగ్లో క్రిమినల్ మిస్ కాండక్ట్ నేర (పూరిత దుష్ప్రవర్తన) ఎక్కడ జరగలేదన్నారు. 13(1)a, 409 అనే సెక్షన్లు వర్తించవని కేటీఆర్ లాయర్ తెలిపారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!