KTR Case: హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ.. ఏసీబీ కేసుపై లంచ్మోషన్ పిటిషన్
- హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ
- ఏసీబీ కేసుపై కేటీఆర్ లంచ్మోషన్ పిటిషన్
- ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్
- కేటీఆర్ తరపున సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం వాదనలు
- కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవు- లాయర్
- రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ పై కేసు నమోదు చేశారు- లాయర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR case trial in High Court.. Lunch motion petition on ACB case: హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ కొనసాగుతుంది. ఏసీబీ కేసుపై కేటీఆర్ లంచ్మోషన్ పిటిషన్ వేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. కేటీఆర్ తరపున సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవని లాయర్ పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ పై కేసు నమోదు చేశారంటూ లాయర్ తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వల్ల హైదరాబాద్కు ప్రయోజనమే కలిగిందని లాయర్ అన్నారు. స్పాన్సర్ తప్పుకోవడం వల్ల హెచ్ఎండీఏ ద్వారా FEO కు చెల్లింపులు జరిగాయని కేటీఆర్ లాయర్ కోర్టుకు చెప్పారు.
Read Also: Atul Subhash Case: మనవడి కోసం సుప్రీంకోర్టుకి అతుల్ సుభాష్ తల్లి..
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
KTR పై ఏసీబీ తప్పుడు కేసు నమోదు చేసిందని కేటీఆర్ లాయర్ ఆర్యమా సుందరం కోర్టుకు తెలిపారు. 14 నెలల తర్వాత కేసు నమోదు చేయడంలోనే రాజకీయ కుట్ర అని అర్థమవుతుంది.. కరప్షన్ జరగనప్పుడు పీసీ యాక్ట్ కేటీఆర్ కు ఎలా వర్తిస్తుందని లాయర్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో స్పాన్సర్ వెనక్కి జరిగినప్పుడు.. ఈవెంట్ నిర్వహించకపోతే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఈ నిర్ణయం జరిగిందని లాయర్ తెలిపారు. ఈ ఏడాది 2024లో ఖచ్చితంగా నిర్వహించాలనే ఈ చెల్లింపులు జరిగాయి.. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ద్వారా హైదరాబాద్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.700 కోట్ల లాభం జరిగిందని లాయర్ పేర్కొన్నారు.
Read Also: Janaki vs State of Kerala: తెలుగులోకి మరో ఇంట్రెస్టింగ్ కోర్టు రూమ్ డ్రామా
కాంగ్రెస్ ప్రభుత్వం FEO కు మిగతా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిందని లాయర్ చెప్పారు. 2023 అక్టోబర్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే FEOకి చెల్లించారన్నారు. అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందని అన్నారు. పబ్లిక్ సర్వెంట్ నేర పూరిత దుష్ప్రవర్తన చేస్తే పీసీ యాక్ట్ పెట్టాలి.. కానీ ఫార్ములా ఈ కార్ రేసింగ్లో క్రిమినల్ మిస్ కాండక్ట్ నేర (పూరిత దుష్ప్రవర్తన) ఎక్కడ జరగలేదన్నారు. 13(1)a, 409 అనే సెక్షన్లు వర్తించవని కేటీఆర్ లాయర్ తెలిపారు.
తాజావార్తలు
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..