One nation One Election: జమిలిపై రిపోర్ట్ రెడీ! నివేదికలో ఏముందంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు (One nation One Election) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అధ్యాయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Kovind) నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. అయితే దేశ వ్యాప్తంగా ఆయా పార్టీల అభిప్రాయాలను సేకరించింది. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఓ నివేదికను కోవింద్ కమిటీ తయారు చేసింది. త్వరలోనే ఆ రిపోర్టును కేంద్రానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది.
రిపోర్టులో ఏముందంటే..
2029 నుంచి ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా నిబంధనలను మార్చే విధానాన్ని సూచించడమే కాకుండా లోక్సభ, అసెంబ్లీలతో పాటు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు ఉమ్మడి ఓటరు జాబితా ఉండాలని సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలతో పాటు రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్ను సవరించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంది. పార్లమెంటు సభల వ్యవధిపై ఆర్టికల్ 83, రాష్ట్రపతి లోక్సభ రద్దుపై ఆర్టికల్ 85, రాష్ట్ర శాసనసభల వ్యవధికి సంబంధించి ఆర్టికల్ 172, రాష్ట్ర శాసనసభల రద్దుపై ఆర్టికల్ 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి ఆర్టికల్ 356 ఇందులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రుతురాజ్ అవస్థీ సూచనలివే..
ఇదిలా ఉంటే జమిలి ఎన్నికలపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థీ నేతృత్వంలోని న్యాయ కమిషన్ కూడా కీలక సిఫార్సులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయాన్ని చేర్చాలని సూచించనున్నట్లు సమాచారం. ఈ నివేదిక ప్రకారం.. దేశంలో తొలి జమిలి ఎన్నికలు 2029 మే-జూన్లో జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలను బట్టి తెలుస్తోంది.
మొత్తానికి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కమిటీ రిపోర్టు సిద్ధమైంది. ఈ ఏడాది జరిగే ఎన్నికలు మాత్రం యథావిధిగా జరిగిపోనున్నాయి. 2029 నుంచి మాత్రం దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!