World Largest Bell: ప్రపంచంలోనే అతి పెద్ద గంటను ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Largest Bell: రాజస్థాన్లోని కోటా నగరంలో చంబల్ రివర్ ఫ్రంట్లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు. అయితే దానిని బిగిస్తున్న టైంలో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక ఇంజినీర్ తో పాటు మరో కార్మికుడు మృతి చెందారు. మరికొందరు గాయపడినట్లు సమాచారం. కోచింగ్ సిటీ కోటాలో ప్రసిద్ధ చంబల్ రివర్ ఫ్రంట్లో ఈరోజు భారీ ప్రమాదం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతి పెద్ద గంట అచ్చును తెరుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో బెల్ మేకింగ్ ఇంజనీర్ దేవేంద్ర ఆర్య, ఓ కూలీ చనిపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగంలో భయాందోళన నెలకొంది. ఈ గంట బరువు దాదాపు 79000 కిలోలు. పోలీసు యంత్రాంగం మొత్తం విచారణలో నిమగ్నమై ఉంది. ఈ గంట తయారైనప్పటి నుంచి చాలా వార్తల్లో నిలుస్తోంది. చంబల్ రివర్ ఫ్రంట్ను ఇటీవల సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించారు.
Read Also:Rahul Dravid: కాంట్రాక్ట్ గురించి ఇప్పుడేం చెప్పలేను.. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోను!
Also Read
కోటా సిటీ డెవలప్మెంట్ ట్రస్ట్కు చెందిన ఎక్సఈఎన్ కమల్ మీనా సమాచారం ఇస్తూ.. చంబల్ రివర్ ఫ్రంట్లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను తయారు చేసినట్లు చెప్పారు. దీని బరువు 79000 కిలోలు. ఎంతో కష్టపడి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గంటను సిద్ధం చేశారు. గంటను అచ్చు పెట్టెలో కొంత సమయం పాటు ప్యాక్ చేసి ఉంచారు. ఈరోజు తెరవాల్సి ఉంది. ఈ రోజు ఈ గంటను తెరవడానికి దీనిని తయారు చేసిన ఇంజనీర్ దేవేంద్ర ఆర్య, తన బృందంతో కోట నది ముందుకి చేరుకున్నారు.
Read Also:Sagar Canal: ఊడిపోయిన సాగర్ కెనాల్ గేటు.. నీట మునిగిన పంటలు
అచ్చు పెట్టెలోని గంటను బయటకు తీయడానికి ఆర్య ఎక్కిన వెంటనే 35 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంజనీర్ ఆర్యను వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంబీఎస్ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఈ గంట ప్రపంచంలోనే అతిపెద్ద గంటగా పేర్కొనబడింది. కోటకు కొత్త రూపాన్ని అందించేందుకు చంబల్ రివర్ ఫ్రంట్ ఇటీవలే నిర్మించబడింది. ఇది కోచింగ్ సిటీ కోటాలో టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ నుండి నిర్మించబడింది. వందల కోట్లతో నిర్మించిన చంబల్ రివర్ ఫ్రంట్ను ఇటీవల సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించారు. ఈ సమయంలో గెహ్లాట్ ప్రభుత్వంలోని దాదాపు మొత్తం మంత్రివర్గం కోటాను చేరుకుంది. ఈ రివర్ ఫ్రంట్ దేశంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా అభివర్ణించబడుతోంది. అయితే పోలీసులు మొత్తం కేసును విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!