Konda Vishweshwar Reddy : ఆలూరు గేటు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరం
- చేవెళ్ల మండలం ఆలూరు గేటు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం
- స్పందించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- ఈ ఘటన బాధాకరమని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Vishweshwar Reddy : చేవెళ్ల మండలం ఆలూరు గేటు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. నేను ఇవాళ సాయంత్రము పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఈ దుర్ఘటనలో గురించి తెలిసిందని, తీవ్ర ఆందోళనకు లోనయ్యానన్నారు. ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయినారు అని, పది మందికి పైగా తీవ్రమైన గాయాలు అయ్యాయని నాతో చెప్పారని, హైదరాబాద్ వైపు నుంచి చేవెళ్ల వైపు పోతున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఆలూరు గేటు మీద కూరగాయాలు అమ్ముకునే వారి మీదకు లారీని నడిపిండు అని స్థానికులు చెప్తున్నారన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, నిన్న కూడా ఖానాపూర్ గేటు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన భార్య భర్తలు చనిపోయారన్నారు. వారి కుమారుడితో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
Dead Body : కాళేశ్వరం గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం
Also Read
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
అంతేకాకుండా..’ అంతకు ముందు మొయినాబాద్ లో బైక్ మీద వెళ్తున్న యువకులకు ప్రమాదం జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి ప్రమాదాలు జరగడం అత్యంత విచారం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. నేను రేపు ఢిల్లీ నుంచి తిరిగి వస్తాను, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు భాధిత కుటుంబాలకు అందుబాటులో ఉండి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా మన్నెగూడ వరకు రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో దురదృష్టం, మొన్న నవంబర్ 18 నాడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు జాతీయ రహదారుల అధికారులతో రోడ్డు పనుల ఆలస్యం మీద సమీక్ష నిర్వహించాను, పనులు మొదలు అవుతాయని హామీ ఇచ్చారు, ఇంతలోపే ఇటువంటి దారుణ సంఘటనలు జరగడం బాధాకరం. ఇవాళ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ధైర్యం చెపుతున్నాను’ అని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.
Maharashtra CM Post: సీఎం అభ్యర్థి పేరు ప్రకటన మళ్లీ వాయిదా? ఎందుకో..!
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..