Komatireddy Venkat Reddy : పేదల ఆత్మగౌరవాన్ని పెంచేందుకే సన్న బియ్యం పంపిణీ
- పేదల ఆత్మగౌరవాన్ని పెంచేందుకే సన్న బియ్యం పంపిణీ
- పేదలకు సన్న బియ్యం పంపిణీ సాహసోపేతమైన నిర్ణయం
- సన్న బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy : పేద ప్రజల ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు సన్న బియ్యం పంపిణీ సాహసోపేత నిర్ణయమని తెలంగాణ మునిసిపల్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో ఇవాళ NTVతో మాట్లాడిన ఆయన, ఈ పథకం వల్ల పేదల ఆత్మగౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. పేదలకు మెరుగైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని ఆయన వివరించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, “గత ప్రభుత్వాలు రేషన్ కార్డుల పంపిణీ విషయంలో పూర్తిగా విఫలమయ్యాయి. రేషన్ షాపులను నిర్వీర్యం చేయడంతోపాటు, పేదలకు నాణ్యమైన ఆహారం అందించడంలో విఫలమయ్యాయి” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పేదలకు లబ్ధి చేకూర్చే గొప్ప అడుగు అని తెలిపారు.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో రేషన్ బస్తాలపై ఉండాలన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, “ఈ దేశానికి ఆదాయ వనరు రాష్ట్రాలే. రాష్ట్రాల ఆదాయమే కేంద్రానికి ఆదాయం. ఆర్థిక వ్యవస్థ రాష్ట్రాల పన్నుల మీద ఆధారపడి ఉంది” అని స్పష్టం చేశారు. “ఫోటోలు పెట్టాల్సి వస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రుల ఫోటోలు చాలా చోట్ల పెట్టాల్సి ఉంటుంది” అంటూ కేంద్ర ప్రభుత్వం వైఖరిపై విమర్శలు గుప్పించారు.
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. సన్న బియ్యం పంపిణీని విజయవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పేదలకు నాణ్యమైన ఆహారం అందించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.
“సామాన్య ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి విషయంలో అంకితభావంతో పనిచేస్తోంది. పేదల హక్కులను కాపాడేందుకు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వ చర్యలు కొనసాగుతాయి” అని మంత్రి హామీ ఇచ్చారు.
illicit Relationship: స్నేహితుడి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. కొట్టి చంపిన బంధువులు
తాజావార్తలు
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!