TS Assembly: కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి.. సభలో కరెంట్ మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. విద్యుత్ పై చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలుపై విచారణ జరిపించవచ్చని అన్నారు. ERC నియమ నిబంధన ప్రకారమే విద్యుత్ కొనుగోలు చేశామని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లపై కాగ్ నివేదికలు కూడా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూడు లేదా నాలుగు గంటల కరెంటు ఇచ్చిన పరిస్థితి లేదని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ వాళ్లు పెట్టుబడిదారుల వైపు ఉన్నారు.. రైతుల వైపు ఎన్నడూ లేరని విమర్శించారు.
CM Revanth: యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశం
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. జగదీష్ రెడ్డిపై విమర్శలు సంధించారు. గత ప్రభుత్వంలో పవర్ లేని పవర్ మినిష్టర్ ఆయన అని జగదీష్ రెడ్డిని అన్నారు. విద్యుత్ వ్యవహరాలు మొత్తం ప్రభాకర్ రావు నడిపాడని.. యాదాద్రి ప్లాంట్ లో వాటా దారుడని కోమటిరెడ్డి అన్నారు. విచారణకు ఆదేశించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభాకర్ రావు, మాజీ మంత్రి జైలుకు పోవడం ఖాయమని అన్నారు. జైల్ కి పోతే జగదీష్ రెడ్డికి అర్థం అవుతోందని కోమటిరెడ్డి విమర్శించారు.
KP Nagarjuna Reddy: మార్కాపురంలో ఘనంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు..
అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మీరు చేయాల్సిన పని మీరు చేశారు.. మేము చేయాల్సింది మేము చేస్తామన్నారు. సీఎం విచారణ చేస్తాం అన్నారు.. ఈ క్రమంలో వాళ్ళను చూస్తే బాధ అనిపిస్తుందని తెలిపారు. పాత కొత్త పార్టీ అంటున్నారు.. బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో కనుమరుగు అవ్వడం ఖాయమని విమర్శించారు. కాగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్ లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో వారిని స్పీకర్ సముదాయించారు. మంచి ప్రాక్టీస్ కాదని అన్నారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ ప్రతీ రోజు పోడియం దగ్గరకు వచ్చి బెదిరిస్తున్నారు.. ఇదేం పద్దతి అని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..