CM Revanth: యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీలో విద్యుత్ రంగంపై జరుగుతున్న స్వల్ప కాలిక చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురు దాడి చేస్తున్నాం అనుకుంటున్నారన్నారు. అది రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో తెలియడం లేదు వాళ్లకని విమర్శించారు. గత ప్రభుత్వం వాస్తవాలు ఎప్పుడూ సభ ముందు పెట్టలేదని అన్నారు. విద్యుత్ శాఖను స్కానింగ్ చేసి ప్రజల ముందు పెడతాం.. వాస్తవాలు ఒప్పుకుని.. హుందాగా ఉంటే బాగుంటుందని తెలిపారు. జగదీష్ రెడ్డి విచారణ చేయండి అని సవాల్ విసిరారు.. జ్యుడీషియల్ విచారణకి సిద్ధమని ముఖ్యమంత్రి అన్నారు. మూడు అంశాలపై జ్యుడీషియల్ విచారణకి సిద్ధంగా ఉన్నామని సీఎం పేర్కొన్నారు.
Student Suicide: కరీంనగర్లో విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణం
Also Read
- Rajnath Singh: భారత్కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
- Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
విద్యుత్ సెంటిమెంటును గత ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పాల్పడిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఛత్తీస్ ఘడ్ తో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందం చేసుకున్నారని, విద్యుత్ ను ఉపయోగించుకున్నా.. ఉపయోగించుకోకున్నా డబ్బులు చెల్లించాలని ఉందని అన్నారు. మీ ఉద్దేశాలు ఏందో విచారణలో తెలుతాయి.. ఛత్తీస్ ఘడ్ ఒప్పందంపై విచారణ చేస్తామని సీఎం అన్నారు. ఛత్తీస్ ఘడ్ ఒప్పందం మీద విచారణకు అదేశిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా.. భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పై విచారణ చేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. సూపర్ క్రిటికల్ విధానం అమలు చేయండి అని కేంద్రం చెప్పింది.. కానీ ఇండియా బుల్ కంపెనీ సబ్ క్రిటికల్ విధానంతో చేస్తుంది వద్దు అన్నామన్నారు.
అంతేకాకుండా.. భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏడేండ్లలో ఇంకా పూర్తి కాలేదు.. 6.47 కోట్లతో పూర్తి కావాల్సింది.. 9.74 కోట్లతో పూర్తి అయ్యిందని ముఖ్యమంత్రి తెలిపారు. KTPS 7 th ఫేజ్ కూడా అట్లనే చేశారని దుయ్యబట్టారు. దీన్ని రెండో అంశంగా విచారణలో చేర్చుతున్నామన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా అంతే.. ఎందుకు పూర్తి కాలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ప్రశ్నించారు. తమ మంత్రి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకు నోరు పెంచుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.
Sabarimala Pilgrims: అయ్యప్ప భక్తుల సమస్యలపై.. రాజ్యసభలో తెలుగులో మాట్లాడిన ఎంపీ!
యాదాద్రి పవర్ ప్లాంట్ పైనా విచారణ చేస్తాం.. అంచనాలు ఎందుకు పెరిగింది అనేది కూడా విచారణ చేస్తామని సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పై జ్యుడీషియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తునట్లు తెలిపారు. ఈ సందర్భంగా.. సభలో విచారణకు సీఎం రేవంత్ ఆదేశించారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు.. ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారని మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాక్ బుక్ చూపిస్తే.. బుక్ లు మాయం చేశారని ఆరోపించారు. అఖిలపక్షంతో కమిటీ వేద్దాం.. అప్పుడు మంత్రిగా ఉన్న వాళ్ళను కూడా చేరుస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Rajnath Singh: భారత్కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
-
TIMS : టిమ్స్లో ఇక సర్జరీలు.. నిమ్స్ తరహాలో తక్కువ ధరకే వైద్యం.!
-
Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
-
Harish Rao : 22A భూములపై హరీశ్ రావు ఫైర్.. ‘కమీషన్ల కోసమే దోపిడీ!’
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!