Kodanda Reddy : నల్ల చట్టాలు తెచ్చి రైతులను మోసం చేశారు మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్ల చట్టాలు తెచ్చి రైతులను మోసం చేశారు మోడీ అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల ఆందోళనతో వెనక్కి తీసుకుంటున్న అన్నారు కానీ ఇప్పటికీ మూడు పార్లమెంట్ సమావేశాలు జరిగాయన్నారు. కానీ బిల్లులు వెనక్కి తీసుకోలేదని, నల్ల చట్టాలు తో రైతులు భూములు కౌలు కి ఇవ్వాలి అంటా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కౌలు కి ఇచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది తెలియదని కోదండరెడ్డి మండిపడ్డారు. గోదాముల్లో నిల్వలు ఉండొద్దనే చట్టం కూడా ఎత్తేశారని, అదానీ.. అంబానీకి లాభం చేసే పనిలో మోడీ ఉన్నారని ఆయన విమర్శించారు. నిల్వలు రైతులు.. జవాన్లకు అక్కరకు వస్తాయని కాంగ్రెస్ ఆలోచన అని, కానీ ఇప్పుడు దాన్ని ఆపేశారన్నారు. బడా బాబులకు లబ్ది చేకూర్చేలా మోడీ వ్యవహారం ఉందన్నారు.
Suresh: మొదటి భార్యతో విడిపోవడానికి కారణం అదే.. ఇక రాశీని పెళ్లాడాక..
Also Read
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు.. కేసులు ఎత్తేయాలి అని ఆయన అన్నారు. మద్దతు ధర ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాంకుల ద్వారా అప్పులు రైతులకు ఎక్కువ ఇవ్వాలి అని, పంటల భీమా పథకం పక్కన పెట్టారన్నారు. మద్దతు ధర అడిగే విషయంలో రైతుల సలహాలు కూడా తీసుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మోడీ సర్కారు కి వ్యతిరేకంగా 16వ తేదీన ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులను.. కార్మికులను హత్య చేసేలా ఉన్నాయి నల్ల చట్టాలు అని, అన్ని సంఘాల తో కమిటి వేసుకోవాలన్నారు. పార్టీ తరుపున పీసీసీ తో చర్చిస్తామని, ఇందిరా పార్క్ లో భారీ ఎత్తున ధర్నా చేద్దామన్నారు. రైతులను కాపాడుకోవడానికి అందరం సిద్ధం అవ్వాలని, మంత్రులు కూడా ఇందిరా పార్కు కి వస్తారు ధర్నాలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. సీపీఐ.. సీపీఎం.. జనసమితి పార్టీ అందరిని కలుపుకుని పోదామన్నారు. నిరసన సక్సెస్ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటదన్నారు. తర్వాత కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షడు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. నల్ల చట్టాలు దొడ్డి దారిన అమలు చేసే కుట్ర జరుగుతుందని, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బడా బాబులకు లబ్ది చేకూర్చే పనిలో ఉన్నారు బీజేపీ నేతలు అని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో పెద్ద ర్యాలీ చేయాలని, గ్రామీణ రైతులకు కూడా అర్థం అయ్యేలా నిరసన ఉండాలన్నారు. రైతులకు జరిగే నష్టాన్ని వివరించాలన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?