Kidney : వేసవిలోనే కిడ్నీలో రాళ్లు ఎందుకు పడతాయో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney : వేసవిని కిడ్నీ స్టోన్ సీజన్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా వేసవిలో మనకు దాహం ఎక్కువ అవుతుంది. శరీరం కూడా డీహైడ్రేషన్ ప్రమాదానికి గురవుతుంది. ఈ సీజన్ లో చక్కెర శాతం అధికంగా ఉండే సాఫ్ట్ డ్రింక్స్ పెద్ద మొత్తంలో తాగడం.. నిర్జలీకరణంతో పాటు మూత్రపిండాల్లో రాళ్లకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయి. వేసవి సీజన్లో శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రత ప్రభావం కిడ్నీపై ఉంటుంది. వేడి, తేమ మూత్రపిండాలకు చాలా హానికరం. చెమట వల్ల మన శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. కిడ్నీలో రాళ్లకు డీహైడ్రేషన్ ఒక కారణం.
శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచే వాటిలో కిడ్నీ ఒక ముఖ్యమైన భాగం. కిడ్నీ శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. కిడ్నీలు ఎలక్ట్రోలైట్స్ స్థాయిని నియంత్రిస్తాయి. మూత్రపిండాలు శరీరంలోని ఉప్పు, నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడతాయి. కిడ్నీలలోని మిలియన్ల ఫిల్టర్లు రక్తం నుండి విషాన్ని తొలగిస్తాయి.
Also Read
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
Read Also:Asaduddin Owaisi: బీజేపీ వారిని కూడా ఇలాగే చంపేస్తుందా.? యూపీ ఎన్కౌంటర్పై ఓవైసీ
వేసవిలో కిడ్నీ స్టోన్ సమస్య ఎందుకు పెరుగుతుంది?
– వేసవిలో వచ్చే కిడ్నీ సమస్యలలో 80 శాతం కాల్షియం వల్లనే వస్తాయి.
– మూత్రంలో కాల్షియం పెరగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది.
– నీరు లేకపోవడం వల్ల మూత్రం ఒకే చోట పేరుకుపోయి కిడ్నీలో రాళ్ల రూపంలో ఉంటుంది.
కిడ్నీలో రాళ్లను నివారించడానికి ఈ ఆహారంలో మార్పులు చేయండి
– ఆహారంలో ఉప్పు తగ్గించండి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల మూత్రంలో కాల్షియం పరిమాణం పెరుగుతుంది.
– వేసవిలో టీ-కాఫీ తీసుకోవడం తగ్గించండి. కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది.
– నీరు ఎక్కువగా తాగాలి. మీరు రోజంతా ఎంత నీరు త్రాగుతున్నారో జాగ్రత్తగా ఉండండి. పుష్కలంగా నీరు త్రాగడం మూత్రపిండాలను నిర్విషీకరణ చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
– ఆహారంలో ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగ, లస్సీ, జ్యూస్, లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
– క్రమం తప్పకుండా మూత్రాన్ని తనిఖీ చేయండి. మీరు ఎంత తరచుగా మూత్ర విసర్జన చేస్తున్నారో ట్రాక్ చేయండి.
– అలాగే మూత్ర విసర్జన ఎలా ఉందో చెక్ చేసుకోండి.
– మూత్రాన్ని ఎప్పుడూ ఆపుకోకండి. క్రమం తప్పకుండా మూత్రాశయాన్ని ఖాళీ చేయండి. మూత్రం నిలుపుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతుంది.
Read Also:Chennai Super Kings: చెన్నైకి మరో ఎదురుదెబ్బ.. ఆ స్టార్ ప్లేయర్ ఔట్
వేసవిలో ఎక్కువ చెమట పట్టడం, నీళ్లు తాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతుంది. వేసవిలో మనం ఏం తింటున్నామో కూడా చాలా ముఖ్యం. పుల్లని ఆహారాలు కిడ్నీలో రాళ్ల సమస్యను పెంచుతాయి, ఈ ఆహారాలలో ఉప్పు, ప్రోటీన్, చక్కెర అధికంగా ఉంటాయి, ఇది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను పెంచుతుంది. వేసవిలో కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం.
తాజావార్తలు
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!