KL Rahul: అందువల్లే మ్యాచ్ ఓడిపోయాము.. ఓటమిపై కెప్టెన్ ఏమన్నాడంటే..?
- రాయ్పూర్ వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.
- ఈ ఓటమికి ప్రధాన కారణం టాస్ కోల్పోవడమే
- రెండో ఇన్నింగ్స్లో డ్యూ ఎక్కువగా ఉండటంతో బౌలర్లకు బంతిని నియంత్రించడం చాలా కష్టం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul: రాయ్పూర్లో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ఓడడానికి టాస్ కోల్పోవడమే మ్యాచ్ ఫలితంపై పెద్ద ప్రభావం చూపిందని టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ పేర్కొన్నారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 358/5 భారీ స్కోరు నమోదు చేసినప్పటికీ, దక్షిణాఫ్రికా ఆ లక్ష్యాన్ని 49.2 ఓవర్లలో ఛేదించి 4 వికెట్లతో ఘన విజయం సాధించింది.
Mahindra XEV 9S First Drive Review: దేశపు మొట్టమొదటి 7-సీటర్ EV.. ఫర్ఫామెన్స్ ఎలా ఉందంటే..?
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
మొదటగా బ్యాటింగ్ చేసిన భారత జట్టులో విరాట్ కోహ్లీ 93 బంతుల్లో 102 పరుహులు చేసి తన 53వ వన్డే శతకాన్ని సాధించగా.. ఇక మరో ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ 83 బంతుల్లో 105 పరుగులతో తన కెరీర్ తొలి వన్డే సెంచరీని నమోదుచేశారు. ఈ ఇద్దరి శతకాలతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్లో డ్యూ ఎక్కువగా ఉన్న కారణంగా బౌలర్లకు ఇబ్బందిగా మారిందని అన్నారు. అలాగే ఈ ఓటమి అంత బాధగా అనిపించట్లేదు.. రెండో ఇన్నింగ్స్లో డ్యూ కారణంగా బౌలింగ్ చాలా కష్టంగా మారింది, టాస్ మళ్లీ పెద్ద పాత్ర పోషించిందని అన్నారు. రెండోసారి కూడా నేను టాస్ ఓడిపోయాను.. అందుకే కొంచెం నన్నే తిట్టుకుంటున్నా (నవ్వుతూ) అని రాహుల్ వ్యాఖ్యానించారు.
Mohit Sharma: అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన టీమిండియా ప్లేయర్..!
భారీ స్కోరు చేసినప్పటికీ మరో 20–25 పరుగులు ఎక్కువ చేసి ఉంటే బౌలర్లకు మరింత ఉపయోగపడదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి 350+ మంచి స్కోరే కానీ.. ఆ తడిబంతితో బౌలర్లు కొంచెం బాగా ఉండేందుకు మరికొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేదని అన్నారు. ఇక ఆ తర్వాత రాహుల్, కోహ్లీ–రుతురాజ్ ఆటతీరును ప్రశంసించారు. రుతు బ్యాటింగ్ అద్భుతం. అర్ధసెంచరీ తర్వాత అతని ఆట వేగం పెంచిన తీరు చూడడానికి చాలా బాగుంది. కోహ్లీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఇలాంటి ఆట తీరు ఆయన ఎన్నోసార్లు కనపరిచారని రాహుల్ అన్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!