KL Rahul: వన్డే సిరీస్కు కెప్టెన్గా స్టార్ ప్లేయర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా జట్టను ఈ రోజు ప్రకటించారు. గౌహతిలో జరిగిన రెండో టెస్ట్ రెండో రోజున సెలక్షన్ కమిటీ సమావేశమై వన్డే సిరీస్కు జట్టును ప్రకటించింది. ఈ టీంకు కెప్టెన్గా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు. శుభ్మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ లేకపోవడంతో జట్టు నాయకత్వ బాధ్యతను సెలక్షన్ కమిటీ రాహుల్కు అప్పగించింది. కోల్కతా టెస్ట్లో జట్టు కెప్టెన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. అలాగే ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే వైస్ కెప్టెన్ అయ్యర్ గాయపడి నాటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు.
Also Read
- West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
- Rahul Gandhi: “భయపడొద్దు.. ముస్లింలకు మద్దతుగా నిలవాలి”.. రాహుల్ గాంధీ
- Pakistan: పాకిస్తాన్లో రక్తపాతం.. జాఫర్ ఎక్స్ప్రెస్పై బీఎల్ఏ దాడి.. 23 మంది దుర్మరణం
- MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
భారతదేశం – దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నవంబర్ 30 ఆదివారం రాంచీలో ప్రారంభమవుతుంది. ఈసారి జట్టుకు రాహుల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ వికెట్ కీపర్ – బ్యాట్స్మన్ రెండేళ్ల విరామం తర్వాత ఈ ఫార్మాట్లో జట్టుకు మళ్లీ నాయకత్వం వహించనున్నాడు. యాదృచ్ఛికంగా ఈ స్టార్ ప్లేయర్ చివరిసారిగా 2023లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు.
ఇక వన్డే సిరీస్ కోసం తలపడనున్న జట్టు గురించి చెప్పాలంటే.. అందరూ ఊహించినట్లుగానే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంపికయ్యారు. అయితే మరో నలుగురు ఆటగాళ్లు ఈ ఫార్మాట్లోకి తిరిగి వస్తున్నారు. వారిలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి రిషబ్ పంత్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పంత్ ఈ ఫార్మాట్లో జట్టులోకి తిరిగి వస్తున్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడంతో, ఛాంపియన్స్ ట్రోఫీలో పంత్కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఈ సిరీస్లో అయినా ఈ స్టార్ ప్లేయర్కు అవకాశం లభిస్తుందో లేదో చూడాలి.
వన్డే సిరీస్కు భారత జట్టు ఇదే..
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్.
🚨 NEWS 🚨#TeamIndia's squad for @IDFCFIRSTBank ODI series against South Africa announced.
More details ▶️https://t.co/0ETGclxAdL#INDvSA pic.twitter.com/3cXnesNiQ5
— BCCI (@BCCI) November 23, 2025
READ ALSO: Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి వాయిదా.. ఎందుకో తెలుసా!
తాజావార్తలు
-
Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
-
Rishabh Pant’s LSG Captaincy: రూ.27 కోట్లు పెట్టి కొంటే.. అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన.. పంత్ కెప్టెన్సీకి ముప్పు!
-
BYD Atto 3: BYD అట్టో 3 విడుదల.. 630KM రేంజ్, LiDAR టెక్నాలజీ, కేవలం 9 నిమిషాల్లో పూర్తి ఛార్జ్
-
West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
-
Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?