Site icon NTV Telugu

KK Mahender Reddy : కేటీఆర్ అభినవ గోబెల్స్ లాగా అయ్యారు

Kk Mahender Reddy

Kk Mahender Reddy

కేటీఆర్ అభినవ గోబెల్స్ లాగా అయ్యారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను బీఆర్ఎస్ లోకి రమ్మని ఇబ్బంది పెట్టారని, నా ఫోన్ ట్యాపింగ్ అయిందని కంప్లైంట్ ఇవ్వగానే కేటీఆర్ కి పూనకం వచ్చిందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం నేను ఫిర్యాదు ఇస్తే పరువునష్టం ఎలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. ఇంకా అధికారంలోనే ఉన్నానని కేటీఆర్ అనుకుంటున్నారని, కేటీఆర్ ఇచ్చిన నోటీస్ చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు. కేటీఆర్ నన్ను బెదిరిస్తున్నారని నేనూ ఫిర్యాదు ఇస్తా అని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని, నాకు అనుమానం ఉందని ఫిర్యాదు ఇస్తే కేటీఆర్ పరువునష్టం నోటీస్ ఇచ్చారన్నారు. కేటీఆర్ మాత్రం మా నాయకులపై అనుమానం ఉందని అంటున్నారని, నువ్వు మాత్రం మా లీడర్లపై అనుమానం వ్యక్తం చేస్తావ్ అని ఆయన వ్యాఖ్యానించారు. నాకు, జిట్టా, రఘునందన్ లకు నువ్వు చేసిన మోసం పరిస్థితి ఎంటి? అని ఆయన కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version