Kishan Reddy: ఈనెల 11 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా.. విజయవంతం చేయాలి..
- కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం
- హర్ ఘర్ తిరంగాను విజయవంతం చేయాలని పిలుపు
- రుణమాఫీపై కాల్ సెంటర్కు రైతులు కాల్స్ చేస్తున్నారని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈనెల 11 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా జరగనున్న కార్యక్రమం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రైతాంగ సమస్యలు, రుణమాఫీ కాకుండా బాధపడుతున్న రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత సమస్యలు, మహిళా సమస్యలు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరయ్యారు.
Read Also: Jagga Reddy: గంగా ప్రక్షాళన మోడీ అందుకే చేస్తున్నారా..?
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 11వ సారి ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని.. ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర కార్యాలయంలో రుణమాఫీకి సంబంధించిన కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని.. రోజు వేల సంఖ్యలో రైతులు కాల్స్ చేస్తున్నారని చెప్పారు. మాకు రుణమాఫీ కాలేదు.. ఎవరూ సహాయం చేయట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఏ ప్రాతిపాదికన రుణ మాఫీ చేస్తున్నారో అర్థం కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
కాల్స్ మాట్లాడటానికి మొదట్లో ఒక్కరిని పెట్టామని.. రైతుల నుంచి రోజుకి వేల కాల్స్ వస్తుండడంతో ఇప్పుడు ఆరుగురిని పెట్టినా కాల్స్ లిఫ్ట్ చేయడానికి సమయం సరిపోవట్లేదన్నారు. వచ్చే నాలుగున్నరేళ్లు కష్టపడి పని చేయాలని నేతలకు సూచించారు. మనమీద ఆశతో ప్రజలు తెలంగాణలో 36 శాతం ఓట్లు ఇచ్చారని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును సవాలుగా తీసుకొని అంకిత భావంతో పని చేద్దామంటూ కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలు అనుకూలంగా ఉందన్నారు. రేపు చేయాల్సింది ఈరోజే చేసేలా…ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేసే విధంగా సన్నద్ధం కావాలన్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!