Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వడ్ల రాజకీయం దుమారాన్ని రేపుతోంది. 13న రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లై ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, 40 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ పంపుతామని, కేంద్రం తీసుకోవాలని కోరారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం బియ్యం తీసుకోవటం కోసం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏర్పాట్లు కూడా చేసుకుంది. కానీ రాష్ట్రం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రప్రభుత్వం ఘర్షణాత్మకమయిన వైఖరితో, విమర్శలు చేసింది.
రాష్ట్రం ఆలస్యం చెయ్యటం వల్ల రైతులు తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవాల్సి వచ్చింది.తమ రాజకీయ స్వలాభమ్ కోసం, రైతుల జీవితాలతో చెలగాటం ఆడారు. ఉప్పుడు బియ్యం పై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రం అంగీకారాన్ని తెలిపిందన్నారు. వడ్ల కొనుగోలు కోసం ఏ రకమయిన ఏర్పాట్లు చెయ్యలేదన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో బాధ్యతారహితంగా రాష్ట్ర సర్కార్ వ్యవహరించింది.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
గత ఖరీఫ్, రబీ సీజన్ల బియ్యాన్ని ఇప్పటికి ఇవ్వలేదు. తెలంగాణలో 15 కోట్ల గోనె సంచులు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం వద్ద కోటి సంచులు కూడా లేవు. కేసీఆర్, కేటీఆర్ లు తట్టల్లో బియ్యం మోస్తారా? హుజురాబాద్ లో బీజేపీ గెలిచాక రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చింది. యుద్ధప్రాతిపదికన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చెయ్యాలి. నూకల నుంచి బయో ఫ్యుయల్ తయారు చేయొచ్చు.. అందుకోసం బయో ఫ్యూయల్ తయారీ కోసం బోర్డ్స్ ఏర్పాటు చెయ్యాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
రైస్ మిల్స్ లో ఎంత బియ్యం నిల్వ ఉండాలో ఉండటం లేదు. తెలంగాణ లో అన్ని రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చెయ్యాలని అధికారులను అదేశించాం. రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లపై ఎటువంటి చర్యలు తీసుకుందో చెప్పాలి. 40 రైస్ మిల్స్ తనిఖీ చేస్తే 4,53,896 బస్తాల బియ్యం తక్కువ ఉంది. సీబీఐ దర్యాప్తు కోసం ఓ నాయకుడు లేఖ రాశారు. వాస్తవానికి రైస్ మిల్లులపై కేంద్రానికి అధికారం లేదు. ఇంతకూ ఆ బియ్యం ఏమయ్యాయో స్పష్టత కావాలన్నారు. రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం.
రైతుల విషయంలో కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఎన్నో రాష్ట్రాల్లో రైతులు మాకు మద్దతుగా ఉన్నారు. ప్రయివేట్ వాళ్ళు బియ్యాన్ని ఎగుమతి చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు ఆర్ధిక సాయం చెయ్యాలి. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు, ఉద్యోగులకు, ప్రజలకు ఆర్ధిక సాయం చెయ్యాలి. జీహెచ్ఎంసీలో ఉద్యోగులకు ఇప్పటికి జీతాలు ఇవ్వలేదు. రాష్ట్రాన్నీ రావణకాష్టం చేస్తున్నారు. రాజకీయం చేయాలనుకుంటే చాలా అంశాలున్నాయి. కమిషన్ల కోసం అప్పులు తీసుకుంటున్నారన్నారు కిషన్ రెడ్డి.
Read Also: Jagga Reddy: టీఆర్ఎస్, బీజేపీది మైండ్ గేమ్.. 12 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్కి గిఫ్ట్ ఇవ్వాలి..
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!