Kishan Reddy : కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోపిడీ చేసిన పార్టీ.. అది కూడా కుటుంబ పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు, ఎంపీ లక్ష్మణ్ , బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ల సమక్షం లో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీజేపీ లో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయన్నారు. తెలంగాణ ను దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం పైన అన్ని వర్గాలు కంకణం కట్టుకొని ఓడించాలని చూస్తున్నారని, కర్ణాటక లో గెలిచాం ఇక్కడ కూడా గెలుస్తామని పొంఖనలు కొడుతున్న కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోపిడీ చేసిన పార్టీ… అది కూడా కుటుంబ పార్టీ అని, బీఆర్ఎస్ స్థానం లో కాంగ్రెస్ ను ప్రజలు కోరుకోవడం లేదన్నారు కిషన్ రెడ్డి.
Also Read : Tarun Bhasker: బ్రహ్మానందం ఇంటికెళ్లి .. నేను తరుణ్ అని చెప్తే.. అయితే ఏంటి అన్నారు
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
అంతేకాకుండా.. ‘తెలంగాణ లో మార్పు బీజేపీ ద్వారానే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు బీజేపీ కి అండగా నిలబడాలని కృత నిశ్చయం తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అమ్ముకునే పార్టీ… కెసిఆర్ కుటుంబానికి అమ్ముడు పోతారు… బీఆర్ఎస్ కొనే పార్టీ. 2014, 2018 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు అమ్ముడు పోయారు.. కాంగ్రెస్ కి వేసిన BRS కు వేసినట్టే..ఈ రెండు పార్టీలకు వేస్తే ఎంఐఎంకి వేసినట్టే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీ కి పడకుండా ఎంఐఎం కుట్ర చేస్తుంది. బీఆర్ఎస్ మళ్ళీ అధికారం లోకి వస్తె ప్రజల చేతిలో చిప్పనే. గల్లీ గల్లీ బెల్ట్ షాపు పెట్టీ ప్రజల రక్తాన్ని బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం తాగుతుంది. అధికారం లోకి వస్తె బెల్ట్ షాపు లను ఉక్కు పాదం తో అణచి వేస్తాం. మద్యం వ్యాపారాన్ని క్రమ బద్దికరణ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర, ప్రజల భవిష్యత్ కోసం బీజేపీ లో చేరండి, పార్టీ నీ ఆశీర్వదించండి. దోపిడి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల , మాఫియా గా మారి దోచుకున్న వారిని ఎవరిని వదిలేది లేదు.’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Tiger NageswaraRao: టైగర్.. రవితేజకు ఇంత స్పెషల్ అని అనుకోలేదే.. భలే ఉంది
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!