Kishan Reddy : ఈ శిలాఫలకాలు భవిష్యత్ తరాలకు ఓ స్ఫూర్తి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మేరీ మాటీ.. మేరా దేశ్’ కార్యక్రమంలో భాగంగా గోషామహల్ నియోజకవర్గంలో ఇంటింట తిరిగి మట్టి సేకరించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్తో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గోషామహల్ ట్రాఫిక్ (ACP) కార్యాలయం సమీపంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మొక్కలు నాటారు అనంతరం దేశంకోసం జీవితాల్ని త్యాగం చేసిన మహనీయులను గుర్తు చేస్తూ వారి నుంచి స్ఫూర్తి పొందుతూ స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం అక్కడినుంచి.. ఇంటింటికీ తిరుగుతూ మట్టిని సేకరిస్తూ గోషామహల్ లోని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు వందేమాతరం రామచందర్ రావు నివాసం వరకు ఈ మట్టి సేకరణ కార్యక్రమం కొనసాగింది. వందేమాతరం రామచందర్ రావు నివాసం దగ్గర వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబసభ్యుల్ని సన్మానించారు. రామచందర్ రావు త్యాగాన్ని వారి స్ఫూర్తిని పోరాటాన్ని వారి సేవల్ని కిషన్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా.. మనం గతేడాది, ఈ ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని మీ అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
కులామతాలతో సంభంధం లేకుండా దేశ సమగ్రతను చాటుతూ యావత్ దేశం జరుపుకుందని, దీంట్లో భాగంగానే.. ఈసారి ‘మేరీ మాటీ మేరా దేశ్’ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. మనం పుట్టిన నేల.. మనల్ని కన్న దేశం పట్ల గౌరవభావాన్ని చాటుకోవడంతోపాటుగా.. ఈ మట్టి మీద పుట్టి (మన ప్రాంతంలో జన్మించి).. నాడు దేశ స్వాతంత్ర్యం కోసం, తర్వాత రజాకార్లతో పోరాటంలో, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ సరిహద్దులు కాపాడంటలో అమరులైన సైనికులు వారి కుటుంబాలను, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగాలు చేసిన వివిధ సాయుధ బలగాలకు చెందిన వారిని, వారి కుటుంబాలను గుర్తుచేసుకుని వారి త్యాగాలను స్మరించుకుని మన మట్టి గొప్పదనాన్ని చాటుకోవడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం భవిష్యత్ తరాలకు చాటి చెప్పేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఇలా ఇంటింటికీ తిరిగి మట్టిని సేకరించి.. దీన్ని మన సమీపంలోని ఒక పార్కులో గానీ, చెరువు వద్ద గానీ.. ఒక చోట చేర్చి ఈ మట్టితో మొక్కలు నాటుకోవడం.. మన ప్రాంతంలో పుట్టి దేశ సేవలో అమరులైన వారిని స్మరించుకునేలా శిలాఫలకాలను ఏర్పాటుచేసుకోవాలి. ఈ శిలాఫలకాలు భవిష్యత్ తరాలకు ఓ స్ఫూర్తి… ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ.. ఐదు ప్రతిజ్ఞలు చేయాలి. అని ఆయన అన్నారు.
ఆ ఐదు ప్రతిజ్ఞలు..
1. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో నావంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తాను.
2. వలసవాద ఆలోచనలనుంచి విముక్తి
3. ఘనమైన భారతదేశ సంస్కృతి, వారసత్వాలను ప్రోత్సహిస్తాను, ప్రచారం చేస్తాను.
4. దేశ ఐకమత్యం, సార్వభౌమత్వం కోసం నిరంతర కృషి చేస్తాను.
5. దేశ రక్షణకోసం, దేశాభివృద్ధికోసం త్యాగాలు చేసిన వారందరినీ గుర్తుచేసుకుని, గౌరవించడం బాధ్యతగా స్వీకరిస్తాను.
అని ప్రతిజ్ఞ చేయాలి.
ఈ శిలాఫలకాల వద్ద సెల్ఫీలు తీసుకుని..మేరీ మాటీ మేరాదేశ్ వెబ్సైట్లో పోస్టు చేయాలి.. మన పెద్దల ధైర్య సాహసాలను, శౌర్య ప్రతాపాలను, త్యాగాన్ని, మన దేశపు పవిత్రమైన మట్టి గొప్పదనాన్ని స్మరించుకుంటూ ఈ ‘మేరీ మాటీ మేరా దేశ్’ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ మట్టి ని సేకరించి డిల్లీ వేదికగా 75 వేల మొక్కలు నాటి మహనీయుల త్యాగల్ని స్మరించుకునేలా వారి నుంచి స్ఫూర్తి పొందెందుకు అమృత వనం డిల్లీ లో ఏర్పాటు చేయబోతున్నాం అని తెలిపారు. ఇది భవిష్యత్ తరాలకు స్పూర్తి నిస్తుందని ప్రధాని ఆలోచన మేరకుఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం లో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. మన దేశ స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను మొదలుకుని.. నేటి అభివృద్ధి పథంలో ప్రయాణం వరకు ప్రతి అంశాన్నీ దేశ ప్రజలకు గుర్తుచేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. మీరందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని.. కార్యక్రమ స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతున్నాను.’ అని కిషన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
క్వాలిఫైయర్-1లో చిత్తు చేసిన RCB.. ఫైనల్లో GT ప్రతీకారం తీర్చుకుంటుందా? క్లైమాక్స్ ఫైట్ పూర్తి వివరాలు ఇవే..
-
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఈరోజు ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
CM Vijay: తలా అజిత్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. వెంట వచ్చిన స్టార్ హీరోయిన్ త్రిష!
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..