Badradri: ఎన్నికల వేళ 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Badradri: తెలంగాణ ఎన్నికల వేళ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఛత్తీస్గఢ్ – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో 25 మంది వ్యాపార వేత్తలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పోలీసులకు సహకరిస్తే చంపేస్తామని వారిని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన దాదాపు 25 మంది వ్యాపారస్తులు బుధవారం ఉదయం 7 గంటలకు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా గొల్లపల్లిలో నిర్వహిస్తున్న వారాంతపు మార్కెట్కు ఆటోలు, బైకుల్లో బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం, సుక్మా జిల్లాల సరిహద్దులోని తాళ్లగూడెం-గొల్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద మావోయిస్టులు వారు వెళ్తున్న వాహనాలు అడ్డుకుని వ్యాపారులను దించేశారు. ఆటోలు, వాహనాల్లోంచి నిత్యావసర వస్తువులు, మద్యం సీసాలు బయటికి విసిరి పారేశారు. వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు లాక్కొని అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లారు. వీరిలో కొందరు మహిళా వ్యాపారులు కూడా ఉన్నారు.
Read Also:Election Ink: ఎన్నికల ‘సిరా’ తయారు చేసేది ఎక్కడో తెలుసా?
Also Read
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
- Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
- PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
- Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
పోలీసులకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారని..నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరిపై దాడికి పాల్పడ్డారు. అలాంటిదేమీ లేదని, సొంత వ్యాపారం చేసుకుంటున్నామని మమ్ములను వదిలేయమని వేడుకున్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తే చంపేస్తామని బెదిరించారు. అదే సమయంలో మరో ఇద్దరు వ్యాపారులు తమ వాహనాల్లో పోలీసులకు సరుకులు తీసుకెళ్తున్నారు. ముందుగా వెళ్లిన వారిని మావోయిస్టులు అపహరించుకుపోయారని గ్రహించిన వ్యాపారులు తమ వాహనాలను వెనక్కి తిప్పారు. గమనించిన మావోయిస్టులు వారిని వెంబడించారు. కానీ వారు మావోయిస్టుల నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మావోయిస్టులు కిందపడి గాయపడ్డారు. పరారైన ఇద్దరు వ్యాపారులు పోలీసు ఇన్ఫార్మర్లుగా మారారని.. వాళ్ల గనుక తమకు దొరికితే చంపేస్తామని మావోయిస్టులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనతో సంత వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది.
Read Also:Telangana Elections 2023: ఓటు హక్కు వినియోగించుకున్న వెంకటేష్, చిరంజీవి!
తాజావార్తలు
-
Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
-
Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
-
Jung Ho-Yeon: ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన తొలి కొరియన్ నటి.. ‘స్క్విడ్ గేమ్’ స్టార్ మరో అరుదైన ఘనత
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!