Badradri: ఎన్నికల వేళ 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Badradri: తెలంగాణ ఎన్నికల వేళ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఛత్తీస్గఢ్ – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో 25 మంది వ్యాపార వేత్తలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పోలీసులకు సహకరిస్తే చంపేస్తామని వారిని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన దాదాపు 25 మంది వ్యాపారస్తులు బుధవారం ఉదయం 7 గంటలకు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా గొల్లపల్లిలో నిర్వహిస్తున్న వారాంతపు మార్కెట్కు ఆటోలు, బైకుల్లో బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం, సుక్మా జిల్లాల సరిహద్దులోని తాళ్లగూడెం-గొల్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద మావోయిస్టులు వారు వెళ్తున్న వాహనాలు అడ్డుకుని వ్యాపారులను దించేశారు. ఆటోలు, వాహనాల్లోంచి నిత్యావసర వస్తువులు, మద్యం సీసాలు బయటికి విసిరి పారేశారు. వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు లాక్కొని అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లారు. వీరిలో కొందరు మహిళా వ్యాపారులు కూడా ఉన్నారు.
Read Also:Election Ink: ఎన్నికల ‘సిరా’ తయారు చేసేది ఎక్కడో తెలుసా?
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
పోలీసులకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారని..నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరిపై దాడికి పాల్పడ్డారు. అలాంటిదేమీ లేదని, సొంత వ్యాపారం చేసుకుంటున్నామని మమ్ములను వదిలేయమని వేడుకున్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తే చంపేస్తామని బెదిరించారు. అదే సమయంలో మరో ఇద్దరు వ్యాపారులు తమ వాహనాల్లో పోలీసులకు సరుకులు తీసుకెళ్తున్నారు. ముందుగా వెళ్లిన వారిని మావోయిస్టులు అపహరించుకుపోయారని గ్రహించిన వ్యాపారులు తమ వాహనాలను వెనక్కి తిప్పారు. గమనించిన మావోయిస్టులు వారిని వెంబడించారు. కానీ వారు మావోయిస్టుల నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మావోయిస్టులు కిందపడి గాయపడ్డారు. పరారైన ఇద్దరు వ్యాపారులు పోలీసు ఇన్ఫార్మర్లుగా మారారని.. వాళ్ల గనుక తమకు దొరికితే చంపేస్తామని మావోయిస్టులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనతో సంత వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది.
Read Also:Telangana Elections 2023: ఓటు హక్కు వినియోగించుకున్న వెంకటేష్, చిరంజీవి!
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!