Mallikarjun Kharge: రాష్ట్రపతి పేరు ఉచ్చరిస్తూ నోరు జారిన ఖర్గే.. ముర్ము పేరును ఎలా పలికారో చూడండి..(వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని ఓ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్చరించారు. ఈ అంశంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాయ్పూర్లోని సైన్స్ గ్రౌండ్లో జరిగిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఖర్గే రాష్ట్రపతిని ‘ముర్మా జీ’ అని ఉచ్చరించారు. అయితే.. ఆయన వెంటనే సరిదిద్దుకుని ‘ముర్ము’ అని పలికారు. కొన్ని సెకన్ల తర్వాత.. మళ్ళీ మాజీ రాష్ట్రపతి పేరును తప్పుగా ఉచ్చరించారు. ‘కోవింద్’ ను ‘కోవిడ్’ అని పలికారు.
READ MORE: YS Jagan Tour: రేపు చిత్తూరు పర్యటనలో జగన్ రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే..
Also Read
- NEET Exam: నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ సెంటర్.. అసలు నిజం ఇదే..
- Railway Rules: టికెట్ లేని ప్రయాణంపై రైల్వే రూల్స్ చేంజ్.. ఇకపై డబుల్ పెనాల్టీ..
- Maharashtra Temple Tragedy: పర్భణిలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఆరుగురు మృతి
- PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. చెక్ చేసుకోండిలా..
ఖర్గే ఏ అంశంపై ప్రసంగించారు?
ఛత్తీస్గఢ్ అడవుల్లో పెద్ద ఎత్తున చెట్ల నరికివేత అంశంపై మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే ఈ తప్పు చేశారు. బీజేపీ, దాని పారిశ్రామిక మిత్రులు భూమిని లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు.”మన నీరు, అడవి, భూమిని కాపాడుకోవాలి. మనం ఐక్యంగా ఉండాలి. వారు (బీజేపీ) (ద్రౌపది) ముర్మాను రాష్ట్రపతిగా, (రామ్ నాథ్) కోవిడ్ (కోవింద్)ను రాష్ట్రపతిగా చేశామని అంటున్నారు. కానీ మన వనరులను, మన అడవి, నీరు, భూమిని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. నేడు, అదానీ, అంబానీ వంటి వ్యక్తులు దానిని స్వాధీనం చేసుకుంటున్నారు.” అని ఖర్గే వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ చీఫ్ పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆయన చేసిన తప్పును “మహిళా, దళిత, గిరిజన వ్యతిరేకి” అని అభివర్ణించింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. “కాంగ్రెస్ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముపై అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించారు. మొత్తం గిరిజన సమాజం దీనిని ఖండిస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఉద్దేశించి కూడా ఆయన కోవిడ్ లాంటి పదాలను ఉపయోగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ముర్మా జీ అని, కోవింద్ జీని కోవిడ్ జీ అని పిలవడం కాంగ్రెస్కు ఎస్సీ, ఎస్టీ వర్గాల పట్ల తీవ్ర ద్వేషాన్ని తెలియజేస్తుంది.” అని అన్నారు.
Kharge ji's venomous and diabolical attack on Presidents Murmu ji and Kovind ji exposes the dangerous deep rooted Dalit Virodhi mindset of the Congress party. For the Congress party not Dalit welfare but only Dynastic welfare has always been top priority.
Right from denying Dr.… pic.twitter.com/husj6YSkVz— C.R.Kesavan (@crkesavan) July 8, 2025
తాజావార్తలు
-
NEET Exam: నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ సెంటర్.. అసలు నిజం ఇదే..
-
Railway Rules: టికెట్ లేని ప్రయాణంపై రైల్వే రూల్స్ చేంజ్.. ఇకపై డబుల్ పెనాల్టీ..
-
Maharashtra Temple Tragedy: పర్భణిలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఆరుగురు మృతి
-
PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. చెక్ చేసుకోండిలా..
-
Crispy Ridge Gourd Tikki Recipe: బీరకాయతో సూపర్ స్నాక్.. కరకరలాడే టిక్కీలు ఇలా తయారు చేయండి
ట్రెండింగ్
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..