Mallikarjun Kharge: రాష్ట్రపతి పేరు ఉచ్చరిస్తూ నోరు జారిన ఖర్గే.. ముర్ము పేరును ఎలా పలికారో చూడండి..(వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని ఓ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్చరించారు. ఈ అంశంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాయ్పూర్లోని సైన్స్ గ్రౌండ్లో జరిగిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఖర్గే రాష్ట్రపతిని ‘ముర్మా జీ’ అని ఉచ్చరించారు. అయితే.. ఆయన వెంటనే సరిదిద్దుకుని ‘ముర్ము’ అని పలికారు. కొన్ని సెకన్ల తర్వాత.. మళ్ళీ మాజీ రాష్ట్రపతి పేరును తప్పుగా ఉచ్చరించారు. ‘కోవింద్’ ను ‘కోవిడ్’ అని పలికారు.
READ MORE: YS Jagan Tour: రేపు చిత్తూరు పర్యటనలో జగన్ రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే..
Also Read
- Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ఖర్గే ఏ అంశంపై ప్రసంగించారు?
ఛత్తీస్గఢ్ అడవుల్లో పెద్ద ఎత్తున చెట్ల నరికివేత అంశంపై మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే ఈ తప్పు చేశారు. బీజేపీ, దాని పారిశ్రామిక మిత్రులు భూమిని లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు.”మన నీరు, అడవి, భూమిని కాపాడుకోవాలి. మనం ఐక్యంగా ఉండాలి. వారు (బీజేపీ) (ద్రౌపది) ముర్మాను రాష్ట్రపతిగా, (రామ్ నాథ్) కోవిడ్ (కోవింద్)ను రాష్ట్రపతిగా చేశామని అంటున్నారు. కానీ మన వనరులను, మన అడవి, నీరు, భూమిని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. నేడు, అదానీ, అంబానీ వంటి వ్యక్తులు దానిని స్వాధీనం చేసుకుంటున్నారు.” అని ఖర్గే వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ చీఫ్ పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆయన చేసిన తప్పును “మహిళా, దళిత, గిరిజన వ్యతిరేకి” అని అభివర్ణించింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. “కాంగ్రెస్ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముపై అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించారు. మొత్తం గిరిజన సమాజం దీనిని ఖండిస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఉద్దేశించి కూడా ఆయన కోవిడ్ లాంటి పదాలను ఉపయోగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ముర్మా జీ అని, కోవింద్ జీని కోవిడ్ జీ అని పిలవడం కాంగ్రెస్కు ఎస్సీ, ఎస్టీ వర్గాల పట్ల తీవ్ర ద్వేషాన్ని తెలియజేస్తుంది.” అని అన్నారు.
Kharge ji's venomous and diabolical attack on Presidents Murmu ji and Kovind ji exposes the dangerous deep rooted Dalit Virodhi mindset of the Congress party. For the Congress party not Dalit welfare but only Dynastic welfare has always been top priority.
Right from denying Dr.… pic.twitter.com/husj6YSkVz— C.R.Kesavan (@crkesavan) July 8, 2025
తాజావార్తలు
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!