Khalistani Terrorist: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ భారత్ను ముక్కలు చేయాలనుకున్నాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistani Terrorist: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్కూస్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్కు చెందిన ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. గత వారం చండీగఢ్, అమృత్సర్లోని పన్నూన్ ఆస్తులను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. చండీగఢ్లోని నివాసంతో పాటు అమృత్సర్లోని పూర్వీకుల గ్రామమైన ఖాన్కోట్లో పన్నూన్కు చెందిన వ్యవసాయ భూమిని కూడా ఎన్ఐఏ జప్తు చేసింది. ఇదిలా ఉండగా.. భారతదేశాన్ని విభజించడం ద్వారా ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ అనేక దేశాలను సృష్టించాలనుకుంటున్నారని పలు వర్గాలు వెల్లడించాయి. ఎన్ఐఏ రిపోర్టు ప్రకారం.. ఆడియో సందేశాల ద్వారా భారతదేశ ఐక్యత, సమగ్రతను సవాలు చేశారని, కాశ్మీర్ ప్రజల కోసం ఒక ప్రత్యేక దేశాన్ని సృష్టించాలనుకుంటున్నారని సమాచారం. ఒక ముస్లిం దేశాన్ని సృష్టించాలనుకుంటునన్నారని తెలిసింది.
Also Read: Whatsapp: ఆ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు.. ఈ లిస్ట్లో మీ ఫోన్ ఉందా!
Also Read
- Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో తొలి వ్యక్తిగత 'స్వర్ణం' కైవసం.!
- IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్పై భారత్ 19-0తో సంచలన విజయం.!
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
పంజాబ్, దేశవ్యాప్తంగా భయాన్ని వ్యాప్తి చేయడానికి ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించడంలో, కమీషన్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించినందుకు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ను 2019 నుంచి ఎన్ఐఏ అతడి కార్యకలాపాలపై నిఘా పెట్టింది. కాగా, గురుపత్వంత్ సింగ్ పన్నూన్, సిక్కులకు ప్రత్యేక ఖలిస్థాన్ కోసం వేర్పాటువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. భారత్కు వ్యతిరేకంగా ప్రచారాలు చేయడంతోపాటు పంజాబ్లోని సిక్కు యువకులను మిలిటెన్సీలో చేరడానికి ప్రేరేపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2020 జూలైలో గురుపత్వంత్ సింగ్ను ఉగ్రవాదిగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ గుర్తించింది. రెండు నెలల తర్వాత కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 51ఏ కింద ఆయన ఆస్తులను అటాచ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.
Also Read: IND vs PAK: పాక్ ఆటగాళ్లకు లైన్ క్లియర్.. భారత్కు వచ్చేస్తున్నారు
2019లో భారత ప్రభుత్వం సిక్కూస్ ఫర్ జస్టిస్ సంస్థను నిషేధించింది. జూలై 2020లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పన్నూన్ను ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే తగిన సమాచారం లేదని పేర్కొంటూ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలన్న భారత ప్రభుత్వ అభ్యర్థనను ఇంటర్పోల్ రెండుసార్లు తిరస్కరించింది. ఇటీవల, మరొక ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై భారతదేశం- కెనడా మధ్య భారీ దౌత్య వివాదం మధ్య కెనడాలోని సీనియర్ భారతీయ దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులను అతను బెదిరించాడు. కెనడా పౌరుడైన నిజ్జర్ను భారత ప్రభుత్వ ఏజెంట్లు హత్య చేశారని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో అంతర్జాతీయ పోరాటాన్ని ప్రారంభించారు. భారతదేశం దృఢంగా, నిస్సందేహంగా, పూర్తిగా ఆ ఆరోపణలను ఖండించింది.
గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఎవరు?
పన్నూన్ – గత సంవత్సరం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గోడలపై ‘ఖలిస్తాన్’ బ్యానర్లు, గ్రాఫిటీలు కనిపించిన వ్యవహారంలో ప్రాథమిక నిందితుడు. 1947లో విభజన సమయంలో అమృత్సర్కు వచ్చారు. అతని కుటుంబం పాకిస్థాన్లోని ఖాన్కోట్ అనే గ్రామానికి చెందినదని తెలుస్తోంది. గురుపత్వంత్ పన్నూన్ తల్లిదండ్రులు చనిపోయారు. అతని సోదరుడు మగ్వంత్ సింగ్ విదేశాల్లో నివసిస్తున్నారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అతను ముస్లిం దేశాన్ని సృష్టించాలనుకుంటున్నాడు. అతను ‘డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఉర్దుస్తాన్’ అని పేరు పెట్టాలనుకుంటున్నాడు. అతను జమ్మూకశ్మీర్ నుంచి విడిపోవడానికి వీలుగా ప్రజలను సమూలంగా మారుస్తున్నాడని పన్నూన్పై ఎన్ఐఏ రిపోర్టులో తెలిపింది. భద్రతా సంస్థల ప్రకారం, పన్నూన్పై మొత్తం 16 కేసులు ఉన్నాయి. ఇవి పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, అలాగే హర్యానా, ఉత్తరాఖండ్లలో నమోదు చేయబడ్డాయి.పన్నూన్ దేశద్రోహంతో సహా దాదాపు రెండు డజన్ల ఇతర కేసులను కూడా ఎదుర్కొంటున్నాడు.
Also Read: ACB Court : చంద్రబాబు వరుస పిటిషన్లు.. విచారణ రేపటికి వాయిదా వేసిన కోర్టు
రిపోర్టు ప్రకారం, ఇండియా గేట్ వద్ద ఖలిస్తానీ జెండాను ఎగురవేసేవారికి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ 2.5 మిలియన్ల అమెరికా డాలర్ల బహుమతిని ఆఫర్ చేశాడు. 2021లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటలో భారత జెండాను ఎగురవేయకుండా ఆపిన పోలీసు సిబ్బందికి అతను ఒక మిలియన్ అమెరికా డాలర్లను కూడా ఆఫర్ చేసినట్లు నివేదించబడింది.పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలోని ప్రముఖ ప్రదేశాలలో ఖలిస్తానీ పోస్టర్లు, జెండాలను అమర్చడానికి అతను చాలాసార్లు ప్రయత్నించాడు.
తాజావార్తలు
-
Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో తొలి వ్యక్తిగత ‘స్వర్ణం’ కైవసం.!
-
IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్పై భారత్ 19-0తో సంచలన విజయం.!
-
Tirupati – Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
-
iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్పై స్టాలిన్ విమర్శలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?