Chandigarh: పంజాబ్లో ఖలిస్తానీ ఉగ్రవాది సహచరుడి అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చండీగఢ్లోని అమృత్సర్లో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్ సహచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇండియాలోని ‘మోస్ట్ వాంటెడ్’ నేరస్థులలో ఒకరైన జర్నైల్ సింగ్ భింద్రన్వాలే మేనల్లుడు రోడ్.. కాగా లఖ్బీర్ సింగ్ పాకిస్తాన్లో గుండెపోటుతో మరణించాడు. అతని సహచరుడు పరమజీత్ సింగ్ అలియాస్ ధాదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
In a major breakthrough, SSOC Amritsar has arrested #UK based, Paramjit Singh @ Punjab Singh @ Dhadi from #Amritsar airport
Also Read
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
An associate of Lakhbir Rode, Chief of banned terrorist outfit #ISYF,Dhadi has been involved in terror funding & other subversive activities in #Punjab 1/2 pic.twitter.com/st928QT4oH
— DGP Punjab Police (@DGPPunjabPolice) December 5, 2023
Read Also: Skin Care : మొటిమలు ఎక్కువగా వస్తున్నాయా? ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి..
పంజాబ్లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర విధ్వంసక కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ISYF (ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్) చీఫ్ లఖ్బీర్ రోడే సహచరుడు ధాదీ అని యాదవ్ చెప్పాడు. అంతేకాకుండా.. ఉగ్రవాద నెట్వర్క్ను వెలికితీసేందుకు దర్యాప్తు జరుగుతోందని పోలీసు చీఫ్ చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న తీవ్రవాద మాడ్యూల్కు పరమజీత్ అరెస్ట్ పెద్ద దెబ్బ అని ఆయన అభివర్ణించారు.
Read Also: Sukhdev Singh Gogamedi: “కర్ణి సేన” అధినేత దారుణ హత్య.. దుండగుల కాల్పుల్లో మృతి
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్లో లఖ్బీర్ సింగ్ రోడ్ గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఖలిస్తానీ వేర్పాటువాద ఉద్యమం వెనుక రోడే.. ఉన్నారని గౌరవ్ యాదవ్ చెప్పారు. భింద్రన్వాలే మరణానంతరం పాకిస్తాన్ పారిపోయి లాహోర్లో స్థిరపడ్డాడు. అయితే అతను.. సోమవారం మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోందని అన్నారు. రోడ్ ‘ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్’ నాయకుడు అని పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..