Ponnala: 45 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత ఈ చర్య బాధాకరంగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnala Lakshmaiah: పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు పంపించారు. పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పార్టీ ఓడిపోయిందని తెలిపారు. కానీ తనను రాజీనామా చేయించి పార్టీ బలి పశువును చేసిందంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన మాట్లాడుతూ, 45 ఏళ్ల రాజకీయ జీవితం తనదని పొన్నాల అన్నారు. 45 ఏండ్ల తర్వాత ఈ చర్య బాధాకరంగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మీకు తెలియంది కాదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందని పొన్నాల కంటతడి పెట్టారు. పేద కుటుంబం నుండి వచ్చి ఈ స్థాయికి వచ్చానని ఆయన తెలిపారు. వరుసగా మూడు సార్లు గెలిచిన బీసీ నేతను అయినా.. పార్టీలో అవమానం కలిగిందని చెప్పుకొచ్చారు. 40 ఏండ్లలో మూడు సార్లు మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని.. వచ్చిన మూడు సార్లు కూడా తెలంగాణలో బలంగా లేమని చెప్పారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
పదవుల కోసం తాను రాజీనామా చేయలేదని పొన్నాల తెలిపారు. భవిష్యత్ పై సమాధానము లేదని.. ఎవరెవరో ఏదో ఊహిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ లో చేరుతున్న అనే ప్రచారం బాగానే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ గురించి ఏం నిర్ణయం జరగలేదని.. టికెట్లు అమ్ముతున్నారు అనేది మీకు తెలియదా అని పొన్నాల చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ లో చేరాలని సలహా ఇస్తున్నారా అని ప్రశ్నించారు.?
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!